భర్త గుడ్లు తేవటం లేదని..

Woman Runs Away From Husband For Eggs In UP - Sakshi

లక్నో : తినడానికి కోడిగుడ్లు తేవటంలేదన్న కోపంతో ఓ భార్య, భర్తను విడిచి ప్రియుడితో పారిపోయింది. ఈ వింత సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌ జిల్లాలో శనివారం చోటుచేసుకుంది. వివరాల మేరకు.. గోరఖ్‌పూర్‌ జిల్లాలోని కంపేర్‌గంజ్‌కు చెందిన ఓ మహిళ ప్రతిరోజూ తినడానికి గుడ్లు తేవాలని భర్తతో గొడవపడేది. దినసరి కూలీ అయిన సదరు భర్త ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఇందుకు నిరాకరించేవాడు. దీంతో శనివారం మహిళ భర్తతో గొడవపడి ప్రియుడితో ఇంట్లోంచి పారిపోయింది. ఈ విషయంపై మహిళ భర్త మీడియాతో మాట్లాడుతూ.. ‘నేనో దినసరి కూలీని. నా ఆదాయంతో ప్రతి రోజూ కుటుంబానికి గుడ్లు తెచ్చిపెట్టే పరిస్థితి లేదు. ఈ బలహీనతను అలుసుగా తీసుకుని నా భార్య రోజూ గుడ్లు కావాలని గొడవపెట్టుకునేది. ఆమె ప్రియుడు ప్రతి రోజూ గుడ్లు తెచ్చి ఇచ్చేవాడు. అందుకే అతడితో పరారయింద’ని తెలిపాడు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top