సీఎం కేజ్రీవాల్కు కేంద్రం మరో షాక్ | war starts once again between aravind kejriwal, union governement | Sakshi
Sakshi News home page

సీఎం కేజ్రీవాల్కు కేంద్రం మరో షాక్

Jan 8 2016 12:26 PM | Updated on Mar 29 2019 9:31 PM

సీఎం కేజ్రీవాల్కు కేంద్రం మరో షాక్ - Sakshi

సీఎం కేజ్రీవాల్కు కేంద్రం మరో షాక్

ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కు కేంద్ర ప్రభుత్వం మరో షాకిచ్చింది.

న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కు కేంద్ర ప్రభుత్వం మరో షాకిచ్చింది. డీడీసీఏ స్కాంపై విచారణకు చట్టబద్దత లేదని కేంద్రం ప్రకటించింది. విచారణ కమిషన్ ఏర్పాటు రాజ్యాంగ విరుద్ధమని కేంద్రం పేర్కొంది. డీడీసీఏ కుంభకోణంలో అరుణ్ జైట్లీ ప్రమేయం తేల్చేందుకు విచారణ కమిషన్ ను ఆప్ ఏర్పాటుచేసిన విషయం తెలిసిందే.

మరోపక్క, కావాలనే డీడీసీఏ కుంభకోణంలో అరుణ్ జైట్లీని కేంద్ర ప్రభుత్వం రక్షిస్తోందని ఆమ్ ఆద్మీ పార్టీ నేత అశుతోష్ ఆరోపించారు. అందుకే విచారణను అడ్డుకుంటోందని అన్నారు. స్కాంలో జైట్లీ ప్రమేయం లేకపోతే విచారణ అంటే భయమెందుకు అని ప్రశ్నించారు. జైట్లీ ఏ తప్పు చేయకపోతే విచారణకు సహకరించాలని డిమాండ్ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement