అతిపెద్ద ఎలివేటెడ్‌ ప్రాజెక్టు షురూ | UPs Elevated Road Now Officially Open | Sakshi
Sakshi News home page

అతిపెద్ద ఎలివేటెడ్‌ ప్రాజెక్టు షురూ

Mar 30 2018 2:25 PM | Updated on Aug 25 2018 4:19 PM

UPs Elevated Road Now Officially Open - Sakshi

అందుబాటులోకి వచ్చిన అతిపెద్ద ఎలివేటెడ్‌ రోడ్డు ప్రాజెక్టు

సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో అతిపెద్ద ఎలివేటెడ్‌ రోడ్‌ హిందన్‌ రోడ్‌ ప్రాజెక్టును యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్‌ శుక్రవారం ప్రారంభించారు. మీరట్‌ మీదుగా ఢిల్లీ నుంచి హరిద్వార్‌కు ఈ రోడ్డు ద్వారా ప్రయాణీకులు అత్యంత వేగంగా చేరుకోవడం సాధ్యమవుతుంది. రూ 1147 కోట్లతో చేపట్టిన ఈ ప్రాజెక్టు ద్వారా ప్రయాణీకులకు ట్రాఫిక్‌ ఇబ్బందులు తగ్గడంతో పాటు ప్రయాణ సమయం సైతం ఆదా కానుంది. షెడ్యూల్‌ ప్రకారం 2017లోనే ఈ ప్రాజెక్టు ప్రజలకు అందుబాటులోకి రావాల్సి ఉండగా, నిర్మాణ పనుల్లో జాప్యంతో ఆలస్యమైంది.

10.3 కిమీ పొడవైన ఈ ప్రాజెక్టు చుట్టూ రాజకీయాలూ అలుముకున్నాయి. ప్రాజెక్టును చేపట్టిన ఘనత తమదేనని, 90 శాతం పనులు తమ హయాంలోనే సాగాయని ఎస్‌పీ చెబుతుండగా, ప్రాజెక్టును పూర్తిచేసి ప్రారంభించడం ద్వారా క్రెడిట్‌ కోసం బీజేపీ పాకులాడుతోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement