స్పీకర్ ఆధ్వర్యంలో అఖిలపక్ష భేటీ | Under the auspices of the Speaker of the all-party meeting | Sakshi
Sakshi News home page

స్పీకర్ ఆధ్వర్యంలో అఖిలపక్ష భేటీ

Feb 23 2016 12:57 AM | Updated on Mar 9 2019 3:08 PM

స్పీకర్ ఆధ్వర్యంలో అఖిలపక్ష భేటీ - Sakshi

స్పీకర్ ఆధ్వర్యంలో అఖిలపక్ష భేటీ

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ సోమవారం అఖిల పక్ష సమావేశం నిర్వహించారు.

న్యూఢిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ సోమవారం అఖిల పక్ష సమావేశం నిర్వహించారు. సమావేశాలు సజావుగా సాగాలని, ఆందోళనల వల్ల క్వశ్చన్‌అవర్ నష్టపోకుండా చూడాలంటూ పార్టీలు ఏకాభిప్రాయం వ్యక్తం చేశాయని తెలిపారు. రిజర్వేషన్ల వ్యవస్థ, జేఎన్‌యూ వివాదం నేపథ్యంలో వర్సిటీల నిర్వహణపై చర్చించాలంటూ విపక్షాలు కోరాయని చెప్పారు. రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానంతోపాటు, సాధారణ, రైల్వే బడ్జెట్‌లు, మరికొన్ని కీలక అంశాలపై చర్చ ఉంటుంద న్నారు. వచ్చే వారం లోక్‌సభలో చర్చించాల్సిన అంశాలపై ఈ రోజు మధ్యాహ్నం జరిగే బీఏసీ సమావేశంలో అజెండా రూపొందిస్తామని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement