ఐఎన్ఎస్ విక్రమాదిత్య యుద్ధ నౌకలో మరమ్మతులు చేస్తుండగా విడుదలైన విష వాయువులు పీల్చడంతో ఇద్దరు మరణించారు.
న్యూఢిల్లీ: ఐఎన్ఎస్ విక్రమాదిత్య యుద్ధ నౌకలో మరమ్మతులు చేస్తుండగా విడుదలైన విష వాయువులు పీల్చడంతో ఇద్దరు మరణించారు. మరో ఇద్దరు అస్వస్థతకు గురయ్యారు. కర్ణాటకలోని కార్వార్లో శుక్రవారం నౌకలోపలి మురుగు శుద్ధి విభాగంలో నిర్వహణ పనులు చేస్తుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది.