సరిహద్దు వెంబడి కాల్పులు: ఇద్దరు మృతి | Two killed in Pakistan firing in Jammu and Kashmir | Sakshi
Sakshi News home page

సరిహద్దు వెంబడి కాల్పులు: ఇద్దరు మృతి

Aug 23 2014 8:30 AM | Updated on Mar 23 2019 8:44 PM

పాకిస్థాన్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది.

జమ్మూ కాశ్మీర్: పాకిస్థాన్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. జమ్మూ కాశ్మీర్లోని ఆర్.ఎస్.పురా, ఆర్నియా సెక్టార్లపైకి పాక్ సైన్యం శనివారం  తుపాకి గుళ్ల వర్షం కురిపించింది. ఈ కాల్పుల్లో ఇద్దరు మృతి చెందారని పోలీసులు ఉన్నతాధికారి వెల్లడించారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డరని తెలిపారు. మృతులు మహమ్మద్ అక్రం అతని కుమారుడు అస్లాం (13)గా గుర్తించినట్లు చెప్పారు.

అక్రమ భార్యతోపాటు ముగ్గురు చిన్నారులు, ఓ బిఎస్ఎఫ్ జవాన్ గాయపడ్డారని తెలిపారు. క్షతగాత్రులను జమ్మూ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నారు. పాక్ వైపు నుంచి కాల్పుల ఇంకా కొనసాగుతున్నాయని... భారత్ వెంటనే స్పందించి పాక్ బలగాలపైకి కాల్పులకు దిగిందన్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement