కొద్దిలో భారీ ప్రమాదం తప్పింది | Trains come face to face in Lucknow | Sakshi
Sakshi News home page

కొద్దిలో భారీ ప్రమాదం తప్పింది

Aug 16 2016 9:05 AM | Updated on Sep 4 2017 9:31 AM

కొద్దిలో భారీ ప్రమాదం తప్పింది

కొద్దిలో భారీ ప్రమాదం తప్పింది

ఉత్తరప్రదేశ్లో రెండు రైళ్లకు పెను ప్రమాదం తప్పింది. ఎదురెదురుగా రెండు రైళ్లు ఒకే ట్రాక్పై దూసుకొచ్చాయి.

లక్నో: ఉత్తరప్రదేశ్లో రెండు రైళ్లకు పెను ప్రమాదం తప్పింది. ఎదురెదురుగా రెండు రైళ్లు ఒకే ట్రాక్పై దూసుకొచ్చాయి. రెండు ట్రెయిన్ ల డ్రైవర్లు వేగంగా స్పందించడంతో సరిగ్గా 150 మీటర్ల దూరంలో రెండు రైళ్లు ఆగిపోయాయి. లేదంటే భారీ ప్రాణ, ఆస్తి నష్టం చూడాల్సి వచ్చేంది. సాంకేతిక లోపం తలెత్తడం వల్లే ఈ ప్రమాదం జరిగేందుకు ఆస్కారం చోటుచేసుకుందని ఉత్తర రైల్వే అధికారులు చెప్పారు. విచారణకు ఆదేశించినట్లు వెల్లడించారు.

చర్బాంగ్ రైల్వే స్టేషన్కు సరిగ్గా రెండు కిలో మీటర్ల దూరంలో దిల్ఖుషా క్యాబిన్ ఏరియా వద్ద ఒకే ట్రాక్పై రెండు రైళ్లు ఎదురెదురుగా వచ్చాయి. వాస్తవానికి ఆ రైళ్ల ట్రాక్లు మార్చేది దిల్ ఖుషా క్యాబిన్ వద్దే. అయితే, ట్రాక్ మార్చే ప్రయత్నం చేసినప్పటికీ సాంకేతిక లోపం తలెత్తి అలా జరగలేదు. అప్పటికే అవతలి వైపునుంచి వస్తున్న రైలు భారీ వేగంతో వస్తోంది. దీంతో అవతలి నుంచి వచ్చే రైలు.. ఈ రైలు ఒకే ట్రాక్పైకి దూసుకెళ్లాయి. రెండు రైళ్ల డ్రైవర్లు ఇది గమనించి అత్యవసర బ్రేక్లు వేయడంతో పట్టాలపై భారీ శబ్దం చేస్తూ అవి ఆగిపోయాయి. దీంతో అందులోని ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement