ఆ డ్రోన్ను పట్టిస్తే లక్ష | Suspicious drone near Delhi airport: Police announce Rs 1 lakh reward for information on accused | Sakshi
Sakshi News home page

ఆ డ్రోన్ను పట్టిస్తే లక్ష

Dec 18 2015 10:54 AM | Updated on Sep 3 2017 2:12 PM

ఆ డ్రోన్ను పట్టిస్తే లక్ష

ఆ డ్రోన్ను పట్టిస్తే లక్ష

ఢిల్లీ విమానాశ్రయంపై అనుమానాస్పదంగా పలుమార్లు చక్కెర్లు కొట్టిన డ్రోన్ వివరాలను వెల్లడిస్తే రూ.లక్ష ఇస్తామని ఢిల్లీ పోలీసులు ప్రకటించారు.

న్యూఢిల్లీ: ఢిల్లీ విమానాశ్రయంపై అనుమానాస్పదంగా పలుమార్లు చక్కెర్లు కొట్టిన డ్రోన్ వివరాలను వెల్లడిస్తే రూ.లక్ష ఇస్తామని ఢిల్లీ పోలీసులు ప్రకటించారు. ఈ విషయంలో ఎంత త్వరగా సమాచారం అందిస్తే అంత సహాయం చేసినట్లవుతుందని అన్నారు. గత అక్టోబర్ 27న ఓ డ్రోన్ ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయ పరిసరాల్లో నాలుగైదు సార్లు కనిపించింది.

అది పలు అనుమానాలు రేకెత్తించింది. ఏవియేషన్ నిబంధనల ప్రకారం అది వ్యతిరేక చర్య కావడంతోపాటు ఇటీవల ఉగ్రవాదులు ఎక్కువగా డ్రోన్ లతోనే రెక్కీలు నిర్వహిస్తున్నారని తెలుస్తుండటంతో పోలీసులు ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నారు. వెంటనే కేసును నమోదుచేసి విచారణ చేపట్టిన ఇప్పటి వరకు ఆధారాలు గుర్తించలేకపోయారు. డ్రోన్ పంపించిన వారికోసం మేధావులతో చాలాసార్లు సమావేశాలు నిర్వహించినా ఫలితం లేకుండాపోయింది. దీంతో తాజాగా లక్ష రూపాయల రివార్డును కూడా ప్రకటించారు.

Advertisement
 
Advertisement
Advertisement