కమల్‌నాథ్‌కు ‘సమైక్య’ సెగ | samaikyandhra effect to kamal nadh | Sakshi
Sakshi News home page

కమల్‌నాథ్‌కు ‘సమైక్య’ సెగ

Feb 17 2014 1:21 AM | Updated on Sep 2 2017 3:46 AM

సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ నాయకులు ఢిల్లీలోని పార్లమెంట్ వ్యవహారాల మంత్రి కమల్‌నాథ్ ఇంటిని ముట్టడించారు. జేఏసీ కన్వీనర్ ఆడారి కిశోర్ కుమార్, ఆంధ్రా మేధావుల సంఘం అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఆదివారం ఈ ముట్టడిలో పాల్గొన్నారు.

 ఢిల్లీలో ఆయన ఇంటిని ముట్టడించిన సమైక్యాంధ్ర విద్యార్థి జాక్
 సాక్షి, న్యూఢిల్లీ: సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ నాయకులు ఢిల్లీలోని పార్లమెంట్ వ్యవహారాల మంత్రి కమల్‌నాథ్ ఇంటిని ముట్టడించారు. జేఏసీ కన్వీనర్ ఆడారి కిశోర్ కుమార్, ఆంధ్రా మేధావుల సంఘం అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఆదివారం ఈ ముట్టడిలో పాల్గొన్నారు. రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ బిల్లును మూజువాణి ఓటుతోనైనా నె గ్గిస్తామని కమల్‌నాథ్ పేర్కొనడాన్ని కిశోర్‌కుమార్ తీవ్రంగా ఖండించారు. సీమాంధ్ర ఎంపీలపై సస్పెన్షన్ వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.
 
 ఏఐసీసీ కార్యాలయం ముట్టడి: సమైక్య విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో విద్యార్థులు ఆదివారం సాయంత్రం ఏఐసీసీ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు. దళిత విద్యార్థి జాక్ నాయకులు ఎ.రాజేశ్, జగదీశ్, వెంకట రమణ, సమైక్యాంధ్ర గెజిటెడ్ అధికారుల జేఏసీ, మన్యసీమ జేఏసీ సభ్యులు ఆందోళనలో పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement