హైదరాబాద్‌ చేరుకున‍్న రాష్ట్రపతి | rastrapati reached hyderabad | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌ చేరుకున‍్న రాష్ట్రపతి

Dec 24 2017 12:51 PM | Updated on Sep 4 2018 5:32 PM

సాక్షి, హైదరాబాద్‌: శీతాకాల విడిది నిమిత్తం రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆదివారం మధ్యాహ‍్నం హైదరాబాద్‌ చేరుకున్నారు. హకీంపేట విమానాశ్రయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌, జీహెచ్‌ఎంసీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌ ఆయనకు పుష్పగుచ్ఛం ఇచ్చి ఘనస్వాగతం పలికారు. రాష్ట్రపతి బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో శీతాకాల విడిది నిమిత్తం ఈనెల 27వతేదీ వరకు ఉండనున్నారు. ఈరోజు రాత్రి 7 గంటలకు గవర్నర్‌ నరసింహన్‌ రాజ్‌భవన్‌లో రాష్ట్రపతి దంపతులకు విందు ఏర్పాటుచేశారు. ఈ విందులో ఏపీ ముఖ‍్యమంత్రి చంద్రబాబునాయుడు, తెలంగాణ ముఖ‍్యమంత్రి కేసీఆర్ తదితరులు పాల్గొననున్నారు. రాష్ట్రపతి ఈనెల 27న అమరావతి వెళతారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement