రాజ్ నాథ్ కు అస్వస్థత, ఎయిమ్స్ లో చేరిక | Rajnath Singh hospitalised, admitted in the AIIMS | Sakshi
Sakshi News home page

రాజ్ నాథ్ కు అస్వస్థత, ఎయిమ్స్ లో చేరిక

Aug 13 2014 11:36 PM | Updated on Aug 16 2018 4:04 PM

రాజ్ నాథ్ కు అస్వస్థత, ఎయిమ్స్ లో చేరిక - Sakshi

రాజ్ నాథ్ కు అస్వస్థత, ఎయిమ్స్ లో చేరిక

కేంద్ర హోంశాఖామంత్రి రాజ్ నాథ్ సింగ్ బుధవారం సాయంత్రం స్వల్ప అస్వస్థతకు గురయ్యారు

న్యూఢిల్లీ: కేంద్ర హోంశాఖామంత్రి రాజ్ నాథ్ సింగ్ బుధవారం సాయంత్రం స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఉదర సంబంధిత సమస్యలు తలెత్తడంతో రాజ్ నాథ్ ను వెంటనే ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించారు. 
 
రాత్రి 8.30 గంటలకు ఎయిమ్స్ లో చేర్పించామని అధికారులు ధ్రువీకరించారు. రాజ్ నాథ్ ఆరోగ్య పరిస్థితిని ఎయిమ్స్ ఆస్పత్రిలోని గాస్ట్రోఎంటరాలజీ విభాగం వైద్యులు సుబ్రత్ ఆచార్య పరిశీలిస్తున్నారని అధికారులు తెలిపారు. గురువారం కూడా రాజ్ నాథ్ ఆస్పత్రిలోనే ఉండే అవకాశం కనిపిస్తోంది. 

Advertisement
 
Advertisement
Advertisement