భారతదేశంలో ఎక్కువ మంది గూగుల్లో ఏ అంశం గురించి సెర్చ్ చేశారో తెలుసా.. పీవీ సింధు గురించి. ఒలింపిక్స్లో మహిళల బ్యాడ్మింటన్ ఫైనల్స్లో సింధు ఆడుతుండటంతో ఆమె గురించిన వివరాలు తెలుసుకోడానికి ఎక్కువగా ఆమె పేరు సెర్చ్ చేశారు. ఆ తర్వాతి స్థానంలో ఇప్పటికే రెజ్లింగ్లో కాంస్య పతకం సాధించిన సాక్షి మాలిక్ను వెతికారు. ప్రపంచ నెంబర్ 6 ర్యాంకర్ నొజొమి ఒకుహరాను ఓడించి ఫైనల్స్కు చేరుకున్న పీవీ సింధు భారతదేశంలో అతి ఎక్కువగా సెర్చ్ అయిన అథ్లెట్ సింధుయేనని గూగుల్ సంస్థ తెలిపింది. ఆ తర్వాత వరుసగా సాక్షి మాలిక్, కిదాంబి శ్రీకాంత్, దీపా కర్మాకర్, సానియా మీర్జా, సైనా నెహ్వాల్, వినేష్ ఫోగట్, లలితా బాబర్, వికాస్ యాదవ్, నర్సింగ్ యాదవ్లు నిలిచారు. భారతీయులు ఎక్కువగా బ్యాడ్మింటన్ గురించి, ఆ తర్వాత రెజ్లింగ్ గురించి సెర్చ్ చేశారట. ఒలింపిక్స్లో మన జిమ్నాస్ట్ దీపా కర్మాకర్ అద్భుత ప్రదర్శన తర్వాత ఆ అంశం గురించి కూడా బాగానే వెతికారంటున్నారు. గత వారం రోజుల్లో ఒలింపిక్స్ గురించి ఎక్కువగా వెతుకుతున్న దేశాల్లో భారత్ 11వ స్థానంలో ఉంది.
కేవలం మనవాళ్ల గురించే కాదు.. ప్రపంచంలోనే అత్యంత వేగంగా పరుగెత్తే ఉసేన్ బోల్ట్ గురించి కూడా వివరాలు తెలుసుకోడానికి భారతీయులు ప్రయత్నించారు. ఇక విదేశీ క్రీడాకారుల విషయానికొస్తే, బోల్ట్ తర్వాత శ్రీకాంత్ను ఓడించిన చైనా షట్లర్ లిన్ డాన్, సింధు చేతిలో ఓడిన ఒకుహరా, బంగారు చేప మైఖేల్ ఫెల్ప్స్, చైనా షట్లర్ వాంగ్ యిహాన్ తదితరుల గురించి భారతీయులు బాగానే గూగులమ్మను అడిగినట్లు తేలింది.
దేశంలోని ఇతర ప్రాంతాల కంటే ఈశాన్య రాష్ట్రాల వారికి ఒలింపిక్స్ అంటే ఎక్కువ ఆసక్తి ఉన్నట్లు ఈ సెర్చ్లో తేలింది. అరుణాచల్ ప్రదేశ్, త్రిపుర, మేఘాలయ, మణిపూర్, సిక్కిం, నాగాలాండ్.. ఈ ఆరు రాష్ట్రాలలో నెటిజన్లు రియో గేమ్స్ గురించి ఎక్కువగా సెర్చ్ చేశారు. టాప్ 10 రాష్ట్రాలలో ఇంకా గోవా, పుదుచ్చేరి, హర్యానా, ఉత్తరాఖండ్ రాష్ట్రాలున్నట్లు గూగుల్ తెలిపింది.
గూగుల్ సెర్చిలో టాపర్ ఎవరో తెలుసా?
Published Fri, Aug 19 2016 6:48 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- AP: ఆ జిల్లాల్లో రెండు రోజుల పాటు వర్షాలు
- అబద్ధాల వసంతం.. గ్రూపు రాజకీయాలే ఆసాంతం
- Prajwal Revanna: ఏ గదిలో ఏం జరిగింది?
- మహిళలపై టీడీపీ అభ్యర్థి అనుచిత వ్యాఖ్యలు
- అవన్నీ అపోహలే
- జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
- ఐరాసలో జగన్ విజన్
- బెంగళూరు గెలుపు ‘హ్యాట్రిక్’
- అనుపమా కెరీర్ ప్రస్తుతం నాన్స్టాప్గా... జెట్ స్పీడ్లో
Advertisement