ఎగవేతదారులకు పీఎస్‌యూ బ్యాంకుల షాక్‌ | PSU banks take recovery action against 5,954 wilful defaulters | Sakshi
Sakshi News home page

ఎగవేతదారులకు పీఎస్‌యూ బ్యాంకుల షాక్‌

Aug 27 2017 5:08 PM | Updated on Aug 13 2018 8:05 PM

ఎగవేతదారులకు పీఎస్‌యూ బ్యాంకుల షాక్‌ - Sakshi

ఎగవేతదారులకు పీఎస్‌యూ బ్యాంకుల షాక్‌

కొండల్లా పేరుకుపోయిన రుణ బకాయిల వసూళ్లకు పీఎస్‌యూ బ్యాంకుల్లో కదలిక వచ్చింది

న్యూఢిల్లీః కొండల్లా పేరుకుపోయిన రుణ బకాయిల వసూళ్లకు పీఎస్‌యూ బ్యాంకుల్లో  కదలిక వచ్చింది. రూ 70,000 కోట్ల  రుణాలు చెల్లించాల్సిన 5954 మంది ఉద్దేశపూర్వక ఎగవేతదారులపై ప్రభుత్వ రంగ బ్యాంకులు లోన్‌ రికవరీ యాక్షన్‌ చేపట్టాయి.ఈ ఏడాది మార్చి 31 నాటికి దేశంలోని 21 బ్యాంకులు 5954 మంది ఉద్దేశపూర్వక ఎగవేతదారులపై సర్ఫేసి చట్టం కింద చర్యలు తీసుకున్నాయి.రూ 20943 కోట్ల రుణాల వసూలు కోసం 1,444 మంది డిఫాల్టర్లపై దేశంలో అతిపెద్ద బ్యాంక్‌ ఎస్‌బీఐ చర్యలు చేపట్టగా, మిగిలిన 20 బ్యాంకులు రూ 48,496 కోట్ల రుణ బకాయిల వసూలు నిమిత్తం 4510 మంది ఉద్దేశపూర్వక ఎగవేతదారులపై చర్యలు తీసుకున్నాయి.
 
పీఎస్‌యూ బ్యాంకులకు మొత్తం రూ 92,376 కోట్లు ఉద్దేశపూర్వక ఎగవేతదారుల బకాయిలున్నాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ వర్గాలు పేర్కొన్నాయి.గతేడాదితో పోలిస్తే వీరి సంఖ్య పది శాతం పెరగడం ఆందోళనకరమని తెలిపాయి. 2016-17లో ఎస్‌బీఐ సహా ప్రభుత్వ రంగ బ్యాంకులు రూ 81,683 కోట్ల రుణాలను రద్దు చేశాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement