విదేశీ పర్యటన ముగించుకుని తిరిగొచ్చిన ప్రధాని | Prime Minister Manmohan Singh returns home after a four-day visit | Sakshi
Sakshi News home page

విదేశీ పర్యటన ముగించుకుని తిరిగొచ్చిన ప్రధాని

Oct 12 2013 4:29 PM | Updated on Sep 1 2017 11:36 PM

భారత ప్రధాని మన్మోహన్ సింగ్ నాలుగు రోజుల విదేశీ పర్యటన ముగించుకుని శనివారం స్వదేశం తిరిగొచ్చారు.

భారత ప్రధాని మన్మోహన్ సింగ్ నాలుగు రోజుల విదేశీ పర్యటన ముగించుకుని శనివారం స్వదేశం తిరిగొచ్చారు. ప్రధాని బ్రూనై, ఇండోనేసియాలను సందర్శించారు.

బ్రూనైలో జరిగిన తూర్పు ఆసియా, ఏసియాన్ సదస్సులలో మన్మోహన్ పాల్గొన్నారు. ఆ ప్రాంతంలోని దేశాలతో వాణిజ్య ఒప్పందాల గురించి చర్చించారు. సత్సంబంధాలు కొనసాగించేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించినట్టు భారత్ ప్రకటించింది. ఇందుకోసం పూర్తి స్థాయిలో రాయబారిని నియమించేందుకు సుముఖత వ్యక్తం చేసింది.

Advertisement
 
Advertisement
Advertisement