ఎల్‌పీయూ అవార్డుల ప్రదానం | Pranab Mukherjee conferred LPU’s Transforming Education Awards | Sakshi
Sakshi News home page

ఎల్‌పీయూ అవార్డుల ప్రదానం

Feb 3 2018 3:47 AM | Updated on Feb 3 2018 3:47 AM

Pranab Mukherjee conferred LPU’s Transforming Education Awards - Sakshi

న్యూఢిల్లీ: ఉత్తమ పాఠశాలలు, ఉపాధ్యాయులకు మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ‘ఎల్‌పీయూ ట్రాన్స్‌ఫార్మింగ్‌ ఎడ్యుకేషన్‌’ అవార్డులను తన నివాసంలో ప్రదానం చేశారు. దేశవ్యాప్తంగా 89 పాఠశాలలు, 29 కోచింగ్‌ సెంటర్లకు రూ. కోటి విలువైన గ్రాంట్లు, ఉపాధ్యాయులు, విద్యార్థులకు ప్రోత్సాహకంగా నగదు బహుమతులను అందజేశారు. విద్యార్థులతో మాట్లాడేందుకు వీలుగా ‘ప్రణబ్‌ సర్‌ కి పాఠశాల’ అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇందులో భాగంగా తొలి కార్యక్రమంలో లవ్లీ ప్రొఫెషనల్‌ యూనివర్సిటీ(ఎల్‌పీయూ) విద్యార్థులతో ముచ్చటిస్తూ.. రిజర్వేషన్లు, సమానత్వం, భావి భారత దార్శనికత తదితర అంశాలకు సంబంధించిన ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. 

Advertisement
 
Advertisement
Advertisement