ఆలూ రైతులపై పెప్సీ కేసులు వెనక్కి! | Pepsico agrees to withdraw cases against Gujarat farmers | Sakshi
Sakshi News home page

ఆలూ రైతులపై పెప్సీ కేసులు వెనక్కి!

May 3 2019 4:35 AM | Updated on May 3 2019 4:35 AM

Pepsico agrees to withdraw cases against Gujarat farmers - Sakshi

అహ్మదాబాద్‌: గుజరాత్‌లో బంగాళదుంపలు పండించిన రైతులపై తాము వేసిన కేసులను ఉపసంహరించుకోనున్నట్లు ఆహార, పానీయ ఉత్పత్తుల సంస్థ పెప్సీకో గురువారం ప్రకటించింది. గుజరాత్‌లోని కొంతమంది రైతులు ఎఫ్‌సీ–5 రకం బంగాళదుంపలను పండించగా, ఆ రకం బంగాళదుంపలపై తమకు పంటరకం రక్షణ హక్కులు ఉన్నాయనీ, తమ అనుమతి లేకుండా వీటిని ఎవరూ పండించకూడదంటూ పెప్సీకో మొత్త 11 మంది రైతులపై కేసు వేయడం తెలిసిందే. ఈ రకం బంగాళదుంపలను పెప్సీలో తమ లేస్‌ చిప్స్‌ తయారీకి వినియోగిస్తోంది. పెప్సీకో కేసు వేయడంతో మన దేశంలో రైతులు ఏం పండించాలో ఒక విదేశీ సంస్థ శాసించడం ఏంటంటూ విమర్శలు వెల్లువెత్తడంతో పెప్సీ తాజాగా వెనక్కి తగ్గింది.

Advertisement
 
Advertisement
Advertisement