కాల్పుల ఉల్లంఘ‌న‌కు పాల్ప‌డ్డ పాక్‌ | Pakistan Violates Ceasefire Along LoC In Naugam Sector Jammu Kashmir | Sakshi
Sakshi News home page

కాల్పులు ఉల్లంఘ‌న‌: తిప్పికొట్టిన భార‌త్‌

Jun 17 2020 11:50 AM | Updated on Jun 17 2020 11:57 AM

Pakistan Violates Ceasefire Along LoC In Naugam Sector Jammu Kashmir - Sakshi

శ్రీన‌గ‌ర్ : దాయాది దేశం పాకిస్తాన్ మ‌రోసారి దుందుడుకు చ‌ర్య‌కు పాల్ప‌డింది. మంగ‌ళ‌వారం సాయంత్రం మోర్టార్లు విసురుతూ కాల్పుల విర‌మ‌ణ ఒప్పందానికి తూట్లు పొడిచింది. జ‌మ్ము క‌శ్మీర్‌లోని నౌగాం సెక్టార్ ప‌రిధిలో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. మోర్టార్లు విసురుతూ, ఇత‌ర ఆయుధాల‌తో కాల్పుల‌కు దిగిన పాక్ సైనికుల‌కు ధీటుగా బ‌దులిచ్చామ‌ని భార‌త ఆర్మీ స్ప‌ష్టం చేసింది. ఈ దాడిలో ఎవ‌రూ గాయ‌ప‌డ‌లేద‌ని, ఎలాంటి ప్రాణ‌న‌ష్టం సంభ‌వించలేద‌ని తెలిపింది. కాగా పాక్‌ ఒక్క మంగ‌ళ‌వారం నాడే రెండుసార్లు కాల్పులు విర‌మ‌ణ ఒప్పందాన్ని కాల‌రాసింది. ప్ర‌భుత్వ గణాంకాల ప్రకారం.. గత పదహారేళ్లతో పోలిస్తే 2019లో అత్యధిక సార్లు(3168) పాకిస్తాన్‌ కాల్పుల ఉల్లంఘనకు తెగబడింది. (పీవోకే ప్రజలు భారత్‌లో కలవాలనుకుంటారు)

సరిహద్దులో పాక్‌ కవ్వింపు చర్యలు..

Advertisement
 
Advertisement
Advertisement