అవార్డులు అందుకున్న రజనీ, ప్రియాంక | padma awards programme in president bhavan | Sakshi
Sakshi News home page

అవార్డులు అందుకున్న రజినీ, ప్రియాంక

Apr 12 2016 11:53 AM | Updated on Mar 28 2019 5:39 PM

అవార్డులు అందుకున్న రజనీ, ప్రియాంక - Sakshi

అవార్డులు అందుకున్న రజనీ, ప్రియాంక

పద్మ పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమం రాష్ట్రపతి భవన్లో అంగరంగ వైభవంగా జరిగింది. ప్రభుత్వ లాంఛనాల మధ్య రాష్ట్రపతి ప్రణబ్ చేతుల మీదుగా అ అవార్డులను గ్రహీతలు అందుకున్నారు.

న్యూఢిల్లీ: పద్మ పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమం రాష్ట్రపతి భవన్లో అంగరంగ వైభవంగా జరిగింది. ప్రభుత్వ లాంఛనాల మధ్య రాష్ట్రపతి ప్రణబ్ చేతుల మీదుగా అ అవార్డులను గ్రహీతలు అందుకున్నారు. మంగళవారం జరిగిన ఈ కార్యక్రమంలో ఐదుగురుకి పద్మ అవార్డుల్లో అత్యున్నతమైన పద్మవిభూషణ్, పదిమందికి పద్మభూషణ్‌, 40 మందికి పద్మశ్రీ అవార్డులు అందించారు. సినీనటుడు రజనీకాంత్, రామోజీరావు, గిరిజా దేవీ, వాసుదేవ్ కల్ కుంతే ఆత్రే, విశ్వనాథన్ శాంత పద్మవిభూషణ్ అవార్డును అందుకున్నారు.

పద్మభూషణ్ అందుకున్నవారు వీరే..
యార్గగడ్డ లక్ష్మీ ప్రసాద్
సానియామీర్జా
రవీంద్రచంద్ర భార్గవ్
ఉదిత్ నారాయణ్
ఇందుజైన్
దయానంద సరస్వతి
కన్హయ్యలాల్
రామానుజ తాతాచార్య... వీరితోపాటు మరో 40మంది పద్మశ్రీ అవార్డు అందుకున్నారు. పద్మశ్రీ అందుకున్నవారిలో బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement