గుజరాత్: మొన్న డైమండ్స్ ఎగుమతి చేసే ఒక కార్పొరేట్ సంస్థ ముస్లిం యువకుడికి ఉద్యోగం ఇవ్వడానికి నిరాకరిస్తే... తాజాగా ఓ ముస్లిం యువతికి ఇల్లు ఇవ్వడానికి నిరాకరించిన ఉదంతం గుజరాత్లో సంచలన సృష్టించింది. దీనికి నిరసిస్తూ బాధితురాలు జాతీయ మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు చేసింది.
వివరాల్లోకి వెళితే కమ్యూనికేషన్ ప్రొఫెషన్లో ఉన్న 25 ఏళ్ల మిస్బా ఖాద్రి.. మరో ఇద్దరు మహిళా ఉద్యోగినులతో కలిసి ఉండేందుకు నిర్ణయించుకుంది. దీనికోసం వదాలలోని సాంఘ్వి హైట్స్లోని ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కోసం అపార్ట్మెంట్ అసోసియేషన్ను సంప్రదించింది. అంతా ఓకే అయ్యాక.... ఆ ఇంటికి మారడానికి ఒక రోజు ముందు ముస్లింలు తమ అపార్ట్మెంట్లో ఉండడానికి కుదరదంటూ హౌసింగ్ సొసైటీ వారు అభ్యంతరం వ్యక్తం చేశారు.
నివ్వెరపోయిన ఖాద్రి వెంటనే రెంటల్ ఏజెంట్ను సంప్రదించింది. అయితే ఆ అపార్ట్మెంట్లో ఆమెపై ఎలాంటి వేధింపులు, గొడవలు జరిగినా తమకు (హౌసింగ్ సొసైటీ, బిల్డర్, ఏజెంట్) ఎలాంటి సంబంధం లేదని హామీ యిస్తూ నో అబ్జెక్షన్ లెటర్ రాసి యివ్వాలని, అలాగే ఆమె వ్యక్తిగత వివరాలతో కూడిన బయోడేటా కావాలని షరతులు విధించటం జరిగింది. అయితే మిగిలిన ఇద్దరు మహిళలు ఇచ్చిన భరోసాతో వారి షరతులకు ఒప్పుకున్న ఖాద్రి ఎట్టకేలకు ఇంట్లో చేరారు.
అలా ఇంట్లో చేరి వారం రోజులు అయిందో లేదో మళ్ళీ వివాదం మొదటి కొచ్చింది. మిస్బా ఖాద్రి తక్షణమే ఇంటిని ఖాళీ చేయాలనీ, బైటికి గెంటేస్తామనీ, లేదంటే పోలీసులకు పిలవాల్సి వస్తుందని రెంటల్ ఏజెంట్ బెదిరించాడు. ముస్లింలకు ఫ్లాట్ అద్దెకివ్వడానికి తమ కంపెనీ రూల్స్ ఒప్పుకోవంటూ తెగేసి చెప్పాడు. దీంతో విసిగిపోయిన బాధితురాలు జాతీయ మానవహక్కుల కమిషన్ను ఆశ్రయించింది. కాగా ఫ్లాట్లో అద్దెకు చేరిన ముగ్గురిలో మిస్బా ఖాద్రి ఒక్కరే ముస్లిం. ఈ వివాదంతో ముగ్గురూ ఇంటిని ఖాళీ చేయాల్సి వచ్చింది.
గుజరాత్లోనే పుట్టి పెరిగిన తాను 2002 ఘర్షణల అనంతరం ముంబైకి వెళ్లిపోయినట్లు మిస్పా ఖాద్రి తెలిపింది. అయితే ఉద్యోగరీత్యా మళ్లీ గుజరాత్ రావాల్సి వచ్చిందని, అభివృద్దికి నమూనాగా చెప్పుకుంటున్న నరేంద్ర మోదీ ప్రభుత్వ హయాంలో గుజరాత్లో కొనసాగుతున్న మతవివక్షపై ఆమె నిరసన తెలిపింది. గోద్రా అల్లర్లతో మత ఘర్షణలకు పేరు గాంచిన గుజరాత్ రాష్ట్రంలో మత వివక్ష కొనసాగుతున్న ఆనవాళ్లు కనిపించడంపై మిస్బా ఆందోళన వ్యక్తం చేసింది.
మొన్న ఉద్యోగం..నేడు ఫ్లాట్
Published Wed, May 27 2015 12:26 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
విద్య, వైద్య రంగాల్లో విప్లవాత్మక మార్పులు
డ్రైవర్ నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి
ప్రభుత్వ వైద్యశాలల్లో మెరుగైన వైద్యం
చంద్రబాబూ 14 ఏళ్లు ఏం చేశావు?
నీట్కు ఏర్పాట్లు పూర్తి
‘పోస్టల్ బ్యాలెట్’ను వినియోగించుకోండి
పార్లమెంట్లో గళం వినిపిస్తా..
స్వర్ణకవచాలంకరణలో రామయ్య
హామీలపై ఆశలు..
నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
తప్పక చదవండి
- నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
Advertisement