పోలవరం నిర్వాసిత గిరిజనుల సమస్యలపై విచారణ | National ST commission to investigate on exiled tribes | Sakshi
Sakshi News home page

పోలవరం నిర్వాసిత గిరిజనుల సమస్యలపై విచారణ

May 24 2016 5:11 PM | Updated on Aug 21 2018 8:34 PM

పోలవరం నిర్వాసిత గిరిజనుల సమస్యలపై జాతీయ ఎస్టీ కమిషన్‌ విచారణ చేపట్టనుంది.

ఢిల్లీ: పోలవరం నిర్వాసిత గిరిజనుల సమస్యలపై జాతీయ ఎస్టీ కమిషన్‌ విచారణ చేపట్టనుంది. పోలవరం ప్రాజెక్టుతో లక్షా 7 వేల మంది గిరిజనులు నిరాశ్రయులౌతున్నారని ఎస్టీ కమిషన్‌ పేర్కొంది. నిర్వాసితులైన గిరిజనుల పరిహారంపై ఎస్టీ కమిషన్‌ అసంతృప్తిని వ్యక్తం చేసింది.

సరైన నష్ట పరిహారం, పునరావాసం కల్పించలేదని ఎస్టీ కమిషన్‌ అభిప్రాయపడింది. నిరాశ్రయులౌతున్న గిరిజనుల స్థితిగతులు తెలుసుకునేందుకు జూలైలో ఆంధ్రప్రదేశ్‌లో జాతీయ ఎస్టీ కమిషన్‌ పర్యటించనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement