అనంతకుమార్ స్థానంలో నద్దా | Nadda replaces Ananth Kumar as secretary of key BJP poll panel | Sakshi
Sakshi News home page

అనంతకుమార్ స్థానంలో నద్దా

Sep 9 2014 6:11 PM | Updated on Sep 2 2017 1:07 PM

బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ కార్యదర్శిగా సీనియర్ జేపీ నద్దా నియమితులయ్యారు.

న్యూఢిల్లీ: బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ కార్యదర్శిగా సీనియర్ జేపీ నద్దా నియమితులయ్యారు. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా.. కేంద్ర మంత్రి అనంత కుమార్ స్థానంలో నద్దాను నియమించారు. పార్టీ అభ్యర్థుల ఎంపిక, ఇతర ఎన్నికలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడంలో 15 మంది సభ్యులతో కూడిన కేంద్ర ఎన్నికల కమిటీదే కీలకపాత్ర. ఇందులో ప్రధాని నరేంద్ర మోడీ సహా కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, వెంకయ్య నాయుడు, సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీ, నితిన్ గడ్కరీ సభ్యులుగా ఉన్నారు. కాగా సీనియర్ నేతలు ఎల్ కే అద్వానీ, మురళీ మనోహర్ జోషీలకు స్థానం లభించలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement