కార్మికులకు కనీస పెన్షన్ రూ. వెయ్యి | minimum pension to wrokers is 1000 | Sakshi
Sakshi News home page

కార్మికులకు కనీస పెన్షన్ రూ. వెయ్యి

Jan 24 2014 1:49 AM | Updated on Sep 2 2017 2:55 AM

సంఘటిత రంగంలోని కార్మికులకు నెలకు రూ. వెయ్యి కనీస పెన్షన్ ఇవ్వాలన్న కార్మికశాఖ ప్రతిపాదనకు ఆర్థిక మంత్రిత్వశాఖ ఆమోదం తెలిపింది.

 కార్మికశాఖ ప్రతిపాదనకు ఆర్థికశాఖ ఆమోదం
 న్యూఢిల్లీ: సంఘటిత రంగంలోని కార్మికులకు నెలకు రూ. వెయ్యి కనీస పెన్షన్ ఇవ్వాలన్న కార్మికశాఖ ప్రతిపాదనకు ఆర్థిక మంత్రిత్వశాఖ ఆమోదం తెలిపింది. దీనివల్ల దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 44 లక్షల మంది పెన్షనర్లలో 5 లక్షల మంది వితంతువులు సహా 27 లక్షల మందికి తక్షణ ప్రయోజనం చేకూరుతుంది. అలాగే ఉద్యోగుల భవిష్య నిధి పథకం కింద కనీస వేతన పరిమితిని ప్రస్తుతమున్న రూ. 6,500 నుంచి రూ. 15 వేలకు పెంచాలన్న ప్రతిపాదనకు కూడా ఆర్థికశాఖ పచ్చజెండా ఊపింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement