మీరట్: కట్నం కోసం ఓ ప్రబుద్ధుడు కట్టుకున్న భార్యను కడతేర్చాడు. పైపెచ్చు భార్య కాల్వలో పడిపోయిందంటూ కల్లబొల్లి ఏడ్పులతో పోలీసులనే తప్పుదోవ పట్టించాడు. చివరకు పోలీసులు రంగంలోకి దిగటంతో అతగాడు అసలు విషయాన్ని బయటపెట్టాడు. ఈ సంఘటన సోమవారం ఉత్తరప్రదేశ్ మీరట్లో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం... అఫ్తాబ్ (30) భార్య అయేషాతో కలిసి బయటకు వెళ్లాడు. ఈ సందర్భంగా ఆమె గంగా కెనాల్ వద్ద సెల్ఫీ తీసుకుంటోంది. అదును చూసుకుని అఫ్తాబ్ ...భార్యను కాల్వలోకి తోసేశాడు. అనంతరం ఏమీ తెలియనట్లు సర్దానా పోలీస్ స్టేషన్లో తన భార్య ప్రమాదవశాత్తు కాల్వలో పడిపోయినట్లు ఫిర్యాదు చేశాడు.
ఫిర్యాదు నమోదు చేసుకున్న పోలీసులు అయేషా మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టారు. అయితే విచారణలో అఫ్తబ్ పొంతనలేని సమాధానం చెప్పడంతో అతడిని అదుపులో తీసుకుని తమదైన శైలిలో విచారణ జరపడంతో నేరాన్ని అంగీకరించాడు. అయేషాను అడ్డు తొలగించుకునేందుకే ఆమెను అంతం చేసినట్లు తెలిపాడు. అఫ్తాబ్, అయేషాలకు ఏడాదిన్నర క్రితమే వివాహం అయింది. వీరికి ఎనిమిది నెలల కుమారుడు కూడా ఉన్నాడు. ఇందుకు సంబంధించి అఫ్తాబ్ తో పాటు అతని సోదరుడు షహ్నాజ్పై వరకట్న వేధింపుల కింద కేసు నమోదు చేసి, అదుపులోకి తీసుకున్నారు.
సెల్ఫీ తీసుకుంటున్న భార్యను తోసేశాడు
Published Tue, May 31 2016 7:28 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- నేడు వేములవాడకు మోదీ!
- ఇక ఇంటింటికీ వెళ్లి కలుద్దాం
- కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
- ఈఏపీ సెట్ షురూ
- కాకతీయుల స్ఫూర్తితో ఢిల్లీ సుల్తాన్లపై పోరు
- మేడిగడ్డను పరిశీలించిన విచారణ కమిషన్
- పోస్టల్ బ్యాలెట్తో 3.03 లక్షల మంది ఓటు
- చంద్రబాబును మరోసారి నమ్మొద్దు
- మహామహులకూ తప్పని... ఓటమి
- 22 మంది బిలియనీర్లయ్యారు
Advertisement