కేరళ గవర్నర్ షీలా దీక్షిత్‌ రాజీనామా | Kerala Governor Sheila Dikshit resigns | Sakshi
Sakshi News home page

కేరళ గవర్నర్ షీలా దీక్షిత్‌ రాజీనామా

Aug 26 2014 3:55 PM | Updated on Sep 2 2017 12:29 PM

షీలా దీక్షిత్

షీలా దీక్షిత్

కేరళ గవర్నర్ షీలా దీక్షిత్‌ రాజీనామా చేశారు.

తిరువనంతపురం: కేరళ గవర్నర్ షీలా దీక్షిత్‌ రాజీనామా చేశారు. యూపీఏ హయాంలో నియమితులయిన గవర్నర్లకు కేంద్రంలోని ఎన్డీఏ సంకీర్ణ  ప్రభుత్వం ఉద్వాసన పలుకుతున్న విషయం తెలిసిందే. గవర్నర్ పదవి నుంచి వైదొలగాలా వద్దా అని షీలా దీక్షిత్ తొలుత డైలామాలో పడ్డారు.  ఆ తరువాత రాజీనామా చేయడానికి ఆమె నిరాకరించారు. ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీతో సమావేశమై రాజీనామా  విషయం చర్చించారు. కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ను, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిశారు. చివరకు ఈరోజు రాజీనామా చేశారు.

 షీలా దీక్షిత్ సుదీర్ఘకాలం ఢిల్లీ ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోరపరాజయం అనంతరం యూపీఏ ప్రభుత్వం ఆమెను కేరళ గవర్నర్గా నియమించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement