‘వివరాలు ఇవ్వలేదు.. 87 కోట్లు చెల్లించండి’ | Jobless Man Sues Over Employment Exchange For 87 Crore In NCDRC | Sakshi
Sakshi News home page

Aug 28 2018 12:20 PM | Updated on Aug 28 2018 1:26 PM

Jobless Man Sues Over Employment Exchange For 87 Crore In NCDRC - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఆర్టీఐ కింద కోరిన సమాచారాన్ని ఇవ్వడంలో ఎంప్లాయ్‌మెంట్‌ ఎక్సేంజ్‌ కార్యాలయం విఫలమైనందును నష్టపరిహారంగా రూ.87 కోట్లు చెల్లించాలని ఓ నిరుద్యోగి జాతీయ వినియోగదారుల  వివాదాల పరిష్కార కమిషన్‌లో దావా వేశాడు. దీనిపై స్పందించిన కమిషన్‌..  వినియోగదారుల హక్కుల పరిరక్షణ చట్టం సెక్షన్‌ 26 ప్రకారం.. వస్తు, సేవల్లో లోపం కారణంగా తనకు జరిగిన నష్టాన్ని బాధితుడు ప్రతిదారు నుంచి పొందొచ్చు. కానీ, ఈ కేసులో ఫిర్యాదుదారు నిరాధార ఆరోపణలు చేశాడని కమిషన్‌ అభిప్రాయపడింది.

వివరాలు.. ఆర్టీఐ కింద తాను కోరిన సమాచారాన్ని ఇవ్వడంలో ఎంప్లాయ్‌మెంట్‌ ఎక్సేంజ్‌ విఫలమైందని పంచకులకు చెందిన విజయ్‌కుమార్‌ ఆరోపించారు. సరైన సమాచారం లభించనందున తాను తీవ్రంగా నష్టపోయినట్టు జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్‌ని ఆశ్రయించాడు. నష్టపరిహారంగా 87 కోట్ల రూపాయలు చెల్లించేలా ఎంప్లాయ్‌మెంట్‌ ఎక్సేంజ్‌ను ఆదేశించాలని దావా వేశాడు. దీనిపై స్పందించిన కమిషన్‌.. ఆర్టీఐ కింద సమాచారాన్ని కోరాడు అనేందుకు విజయ్‌ వద్ద ఎలాంటి ఫ్రూఫ్‌ లేదని పేర్కొంది. తప్పుదు ఆధారాలతో కమిషన్‌ను విజయ్‌ తప్పుదోవ పట్టించాడని మండిపడింది. ఎంతోమందికి సేవలందించాల్సిన కమిషన్‌ కాలాన్ని వృధా చేశాడని ఆక్షేపించింది. జరిమానాగా విజయ్‌ రూ.100 చెల్లించాలని కమిషన్‌ తీర్పు వెలువరించింది. నాలుగు వారాల్లోగా జరిమానా మొత్తం చెల్లించి రశీదు అందించాలని తెలిపింది. ఇలాంటివి పునరావృతమైతే తీవ్ర చర్యలుంటాయని హెచ్చరించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement