తమిళ అసెంబ్లీలో జయ చిత్రపటం | Sakshi
Sakshi News home page

తమిళ అసెంబ్లీలో జయ చిత్రపటం

Published Tue, Feb 13 2018 1:41 AM

Jayalalithaa’s portrait unveiled in TN Assembly,  - Sakshi

సాక్షిప్రతినిధి, చెన్నై: తమిళనాడు అసెంబ్లీలో దివంగత సీఎం జయలలిత నిలువెత్తు చిత్రపటాన్ని అసెంబ్లీ స్పీకర్‌ ధనపాల్‌ సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్రాభివృద్ధి కోసం జయ  చేసిన కృషిని స్పీకర్‌ కొనియాడారు. సీఎం పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్‌సెల్వం, డిప్యూటీ స్పీకర్‌ పొల్లాచ్చి జయరామన్, అన్నాడీఎంకే ఎంపీలు, ఎమ్మెల్యేలు తదితరులు ఈ కార్యక్రమానికి హాజరై జయకు నివాళులర్పించారు.

అసెంబ్లీ హాలులో ఇప్పటికే పెరియార్, అన్నాదురై సహా పదిమంది అగ్రనేతల చిత్రపటాలను గత ప్రభుత్వాలు ఏర్పాటుచేశాయి. కాగా, చిత్రపట ఆవిష్కరణ కార్యక్రమాన్ని డీఎంకే, కాంగ్రెస్‌ బహిష్కరించాయి. అన్నాడీఎంకే తిరుగుబాటు నేత, ఎమ్మెల్యే టీటీవీ దినకరన్‌ ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. ఆస్తుల కేసులో జయ దోషిగా తేలినందున ఆమె చిత్రపటాన్ని అసెంబ్లీ నుంచి తొలగించాలని కోరుతూ మద్రాసు హైకోర్టులో డీఎంకే పిటిషన్‌ వేసింది.

Advertisement
Advertisement