ఆసియా ఫసిఫిక్ ప్రాంతంలోనే భారత్ ఇంటర్నెట్ స్పీడ్ అతి తక్కువగా ఉన్నట్లు గుర్తించడంతో దాన్ని సగటున 3.5 ఎంబిపీఎస్ ఉండేట్లుగా పెంచారు. దీంతో గత త్రైమాసికంతో పోలిస్తే 24 శాతం పెరిగినట్లు అకమాయ్ నివేదికలు నిర్థారించాయి. అయినప్పటికీ ప్రపంచ ర్యాంకుతో పోలిస్తే 114వ స్థానంలోనే నిలిచినట్లు నివేదికలు చెప్తున్నాయి. దేశంలో ఇంటర్నెట్ వాడకం వేగంగా పెరుగుతున్నప్పటికీ కేవలం 138 శాతం మాత్రమే వృద్ధి కనిపిస్తోంది.
భారతదేశంలో రోజురోజుకూ ఇంటర్నెట్ వినియోగంలో పెరుగుతున్న వృద్ధి చూస్తే నిజంగా గర్వ పడాలి. కానీ వేగంలో మాత్రం ఇప్పటికీ ప్రపంచంలోని మిగిలిన దేశాలతో పోలిస్తే అత్యంత వెనుకబడి ఉండటం విస్మయాన్ని కలిగిస్తుంది. అకమాయ్ అందించిన కొత్త నివేదికల ప్రకారం ఇండియాలో అతితక్కువ వేగంతో ఉన్న ఇంటర్నెట్ స్పీడ్ ను 3.5 ఎంబిపీఎస్ లకు పెంచాలని అమెరికాకు చెందిన కంటెంట్ డెలివరీ, క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్ సూచించింది. ప్రపంచంలోని ఇంటర్నెట్ స్థితిగతుల్లో కనిపించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను అకమాయ్ బయటపెట్టింది. టాప్ లో ఉన్న దక్షిణ కొరియా సగటు ఇంటర్నెట్ వేగం 29 ఎంబిపిఎస్ నుంచి గరిష్ఠంగా 103.6 ఎంబీపీఎస్ వరకూ ఉంది. మొత్తం ప్రపంచ సగటు వేగం 6.4 ఎంబీపీఎస్ ఉండగా.. భారతదేశం గరిష్ఠ వేగం కేవలం 25.5 ఎంబీపీఎస్ మాత్రమే ఉన్నట్లుగా అంచనా వేసింది. భారత సర్వీస్ ప్రొవైడర్లు 25 ఎంబీపీస్ నుంచే ప్రణాళికలను అందించడం ప్రారంభిస్తున్నాయని, యు బ్రాడ్ బ్యాండ్, యాక్ట్ బ్రాడ్ బ్యాండ్ 100 ఎంబీపీఎస్ వరకూ ఆఫర్లు ఇస్తున్నట్లు అకమాయ్ నివేదికలను బట్టి తెలుస్తోంది. అయితే ఇది భారతదేశంలో ఇంటర్నెట్ వినియోగంతో పోలిస్తే చాలా తక్కువగా భావించింది. ఇండియాలో 15 ఎంబీపీఎస్ స్పీడ్ దాటిన కనెక్షన్లు కేవలం 2 శాతమే ఉన్నప్పటికీ వినియోగంలో 210 శాతం అభివృద్ధి కనిపిస్తున్నట్లు నివేదిక్లోల తెలిపింది. దీన్ని బట్టి రాబోయే కాలంలో హైస్పీడ్ కనెక్షన్ల వినియోగదారులు మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం ఇంటర్నెట్ వ్యాప్తి స్థాయిని గమనిస్తే.. భారతదేశ జనాభాలో మూడవ వంతు ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే నవంబర్ 2015 నాటి ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఐఏఎంఏఐ) లెక్కల ప్రకారం దేశంలో 25 శాతం వ్యాప్తి ఉన్నట్లు నిర్థారించింది. అది ఈపాటికి గణనీయంగా పెరిగేందుకు ఎంతో అవకాశం ఉన్నట్లు ఐఏఎంఏఐ చెప్తోంది. ప్రస్తుత కొత్త ప్రాజెక్టులు, డిజిటల్ ఇండియా వంటి వాటితో ఇంటర్నెట్ వినియోగం మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు చెప్తోంది. గ్రామీణ ప్రాంతాలకు ఇంటర్నెట్ సేవలు అందించేందుకు గూగుల్ సైతం ప్రయత్నాలు చేయడం, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు వంటి ప్రభుత్వాలు ప్రజలకు ఇంటర్నెట్ సేవలను చవుకగా అందించే పథకాలను ప్రవేశ పెట్టడం కూడ ఇంటర్నెట్ వినియోగం మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఇదిలా ఉంటే ప్రపంచంలోనే ఇంటర్నెట్ వినియోగంలో భారత్ రెండో స్థానంలో ఉన్నట్లు ఇటీవల మేరీ మీకర్ తన నివేదికల్లో వెల్లడించింది. అంతేకాక దేశంలో పెరుగుతున్న స్మార్ట్ ఫోన్ల అమ్మకాలతోపాటు, పలు కంపెనీలు తక్కువ ధరలకే స్మార్ట్ ఫోన్లను ఎగుమతి చేస్తుండటం కూడ భారత్ రెండో స్థానంలో ఉందన్న వాస్తవాన్ని ప్రతిబింబిస్తోంది.
ఇంటర్నెట్ స్పీడ్ పెరిగింది!
Published Fri, Jul 1 2016 7:42 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
ఆ పూలు స్టార్స్లా అందంగా ఉన్నా..వాసన మాత్రం భరించలేం!
IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
ఉద్యోగం వెతుక్కునే క్రమంలో ఇలా చెయ్యొద్దు!: గూగుల్ ఉద్యోగి
ఇజ్రాయెల్ ప్రధాని కీలక నిర్ణయం.. అల్ జజీరా ఛానెల్పై నిషేధం
‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను ఆపాలని భూకజ్జాదారులు యత్నిస్తున్నారు’
'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
రాణించిన జడేజా.. పంజాబ్ కింగ్స్ టార్గెట్ ఎంతంటే?
బీజేపీ ‘ప్యూన్’ విమర్శలు.. కిశోరి లాల్ శర్మ కౌంటర్
అలాంటి కార్లను ఇష్టపడే వ్యక్తుల్లో శాడిజం ఎక్కువగా ఉంటుందట!
తప్పక చదవండి
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- IPL 2024 GT VS RCB: విరాట్ ఖాతాలో భారీ రికార్డులు.. తొలి భారత క్రికెటర్గా..!
- వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement