
'ఏం మనుషులు.. ఆ నటికి నిద్రే ముఖ్యమేమో'
తెల్లవారు జామున 5గంటలకే ఆజాన్ ఇచ్చి నిద్రభంగం కలిగిస్తున్నారని వ్యాఖ్యానించిన గాయని, నటి సుచిత్రా కృష్ణమూర్తికి సమాజ్వాది పార్టీకి చెందిన ఓ నేత కౌంటర్ ఇచ్చారు.
నిన్న(ఆదివారం) ఆజాన్ వల్ల తనకు నిద్రాభంగం కలిగిందని, అయినా, దేవుడిని ప్రార్థించాలని ఇతరులకు ఇబ్బంది కలిగేలా తెల్లవారు జామున్నే మైకుల ద్వారా చెప్పడం దేనికంటూ ట్వీట్ చేశారు. అంతేకాకుండా తాను బ్రహ్మముహూర్తంలోనే మేల్కొంటానని, పూజలు చేస్తానని, యోగాలాంటివి చేస్తానని, తన దేవుడిని గుర్తు చేసుకునేందుకు ప్రత్యేక లౌడ్ స్పీకర్స్ అవసరం లేదంటూ కూడా ట్వీట్లో పేర్కొన్నారు. దీంతో ఆమెపై ట్విట్టర్లో తీవ్ర విమర్శలు వచ్చాయి.