వాజ్‌పేయి, మాలవ్యాలకు భారత రత్న? | Government to Announce Bharat Ratna for Atal Bihari Vajpayee, Madan Mohan Malaviya Today: Sources | Sakshi
Sakshi News home page

వాజ్‌పేయి, మాలవ్యాలకు భారత రత్న?

Dec 24 2014 2:13 AM | Updated on Aug 15 2018 2:20 PM

మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయికి, ప్రముఖ స్వాతంత్య్ర సమర యోధుడు మదన్ మోహన్ మాలవ్యా..

న్యూఢిల్లీ: మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయికి, ప్రముఖ స్వాతంత్య్ర సమర యోధుడు మదన్ మోహన్ మాలవ్యాకు అత్యున్నత పౌర పురస్కారమైన ‘భారత రత్న’ అవార్డును కేంద్రప్రభుత్వం ప్రకటించనున్నట్టు తెలిసింది. నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు జాతీయ మీడియా మంగళవారం రాత్రి తెలియజేసింది.

వాజ్‌పేయి పేరుమీద ఓ వెబ్‌పేజీ: మాజీ ప్రధాని వాజ్‌పేయి ఇంగ్లిష్, హిందీలో చేసిన 300 ప్రసంగాలు, ఆయన జీవిత విశేషాలను తెలియజేసే చిత్రాలతో కేంద్ర ప్రభుత్వ పత్రికా సమాచార విభాగం (పీఐబీ) వెబ్‌పేజీని ప్రారంభించింది. పీఐబీ అధికారిక వెబ్‌సైట్‌లోనే దీన్ని ఏర్పాటు చేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement