కారుపై కాల్పులు.. నలుగురు మృతి | Former deputy mayor, three others killed in a shootout in Dhanbad | Sakshi
Sakshi News home page

కారుపై కాల్పులు.. నలుగురు మృతి

Mar 22 2017 9:06 AM | Updated on Sep 5 2017 6:48 AM

కారుపై కాల్పులు.. నలుగురు మృతి

కారుపై కాల్పులు.. నలుగురు మృతి

కారుపై సినీ ఫక్కీలో దుండగులు కాల్పులకు పాల్పడిన ఘటనలో ధన్‌బాద్‌ మాజీ డిప్యూటీ మేయర్‌తో సహా నలుగురు మృతి చెందారు.

ధన్‌బాద్‌: జార్ఖండ్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ధన్‌బాద్‌ మాజీ డిప్యూటీ మేయర్‌ నీరజ్‌ సింగ్‌తో పాటు మరో ముగ్గురిని దుండగులు కిరాతకంగా కాల్చిచంపారు. ధన్‌బాద్‌లోని స్టీల్‌గేట్‌ ప్రాంతంలో మంగళవారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది.

బైక్‌పై వచ్చిన దుండగులు నీరజ్‌ పాండే(32) ప్రయాణిస్తున్న ఫార్చునర్‌ కారుని లక్ష్యంగా చేసుకొని విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు. తీవ్ర బుల్లెట్ గాయాలైన నీరజ్‌తో పాటు బాడీగార్డ్‌ లైతు, డ్రైవర్‌ మున్నా, మిత్రుడు అశోక్‌ యాదవ్‌లను ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందారని వైద్యులు ప్రకటించారు. కాసేపట్లో కారు నీరజ్‌ ఇంటికి చేరుకుంటుందనగా.. ఓ స్పీడ్‌ బ్రేకర్‌ వద్ద దుండగులు కాల్పులు జరిపి పారిపోయారు. కారుపై సుమారు 50 బుల్లెట్లు తగిలిన గుర్తులు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. దుండగుల కోసం పోలీసులు గాలింపు చేపడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement