ప్రధాని మోదీపై బీజేపీ ఎంపీ తీవ్ర వ్యాఖ్యలు | 'Fools' Paradise' And 'Planted Surveys': Shatrughan Sinha Vs BJP, Again | Sakshi
Sakshi News home page

ప్రధాని మోదీపై బీజేపీ ఎంపీ తీవ్ర వ్యాఖ్యలు

Nov 24 2016 1:03 PM | Updated on Sep 22 2018 7:50 PM

ప్రధాని మోదీపై బీజేపీ ఎంపీ తీవ్ర వ్యాఖ్యలు - Sakshi

ప్రధాని మోదీపై బీజేపీ ఎంపీ తీవ్ర వ్యాఖ్యలు

నోట్ల రద్దుకు ప్రజలు సంపూర్ణ మద్దతు ఇచ్చారన్న మోదీ వ్యాఖ్యలను శత్రుఘ్నసిన్హా తప్పుబట్టారు.

న్యూఢిల్లీ: పాత పెద్ద నోట్లను రద్దు చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న సంచలనాత్మన నిర్ణయాన్ని బీజేపీ నాయకులంతా ప్రశంసిస్తుంటే ఆ పార్టీకే చెందిన అసమ్మతి ఎంపీ, మాజీ నటుడు శత్రుఘ్నసిన్హా మాత్రం భిన్నంగా స్పందించారు. భ్రమల్లో బతకొద్దని ప్రధాని మోదీకి పరోక్షంగా సూచించారు. నోట్ల రద్దుకు ప్రజలు సంపూర్ణ మద్దతు ఇచ్చారన్న మోదీ వ్యాఖ్యలను శత్రుఘ్నసిన్హా తప్పుబట్టారు. ‘ పిచ్చోళ్ల స్వర్గంలో విహరించడం మానుకోండి. కట్టుకథలు, స్వప్రయోజనాల కోసం నిర్వహించిన సర్వేలకు దూరంగా ఉండాల’ని శత్రుఘ్నసిన్హా అన్నారు.

మొబైల్‌ యాప్ ద్వారా నిర్వహించిన సర్వేలో 93 శాతం మంది పెద్దనోట్ల రద్దుకు మద్దతిచ్చారని, కేవలం 2 శాతం మంది మాత్రమే దాన్ని వ్యతిరేకించారన్నారని ప్రధాని మోదీ బుధవారం వెల్లడించారు. అయితే మోదీ సర్కారు తమకు అనుకూలంగా ఈ సర్వే చేయించుకుందని ప్రతిపక్షాలు ఆరోపించాయి. గ్రామీణ భారతానికి ఈ సర్వేలో ప్రాతినిథ్యం లేదని వ్యాఖ్యానించాయి. గ్రామాల్లో చాలా మందికి స్మార్ట్‌ ఫోన్లు లేవని తెలిపాయి. తమకు వ్యతిరేకంగా వచ్చిన సమాధానాలను ప్రభుత్వం తొలగించిందని ఆరోపించాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement