హిందూఖుష్‌లో భూకంపం; వణికిన ఉత్తర భారతం | earthquake in Afghanistan's Hindu Kush; tremors felt in Delhi | Sakshi
Sakshi News home page

హిందూఖుష్‌లో భూకంపం; వణికిన ఉత్తర భారతం

Jan 31 2018 1:19 PM | Updated on Mar 28 2019 6:10 PM

earthquake in Afghanistan's Hindu Kush; tremors felt in Delhi - Sakshi

న్యూఢిల్లీ : దేశరాజధాని సహా ఉత్తర భారతంలోని పలు రాష్ట్రాల్లో బుధవారం మధ్యాహ్నం భూమి ఒక్కసారిగా కంపించింది. అఫ్ఘనిస్థాన్‌లోని హిందూఖుష్‌ ప్రాంతంలో సంభవించిన భూకంపమే ఇందుకు కారణమని తెలిసింది.

హిందూఖుష్‌లో భూకంప కేంద్రాన్ని గుర్తించామని, రిక్టర్‌ స్కేలుపై తీవ్రత 6.1గా నమోదయిదని యూరప్‌-మధ్యధరా భూకంప కేంద్రం ఒక ప్రకటన చేసింది. జమ్ముకశ్మీర్‌లోనూ భూకంప ప్రభావం ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. అయితే ప్రాణ, ఆస్తి నష్టాల వివరాలు తెలియాల్సిఉంది. ఢిల్లీ సహా ఇతర రాష్ట్రాల్లో భూప్రకంపనల ప్రభావం ఏమిటన్నది వెల్లడికావాల్సిఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement