ఢిల్లీలో డీజిల్‌ ఇంజిన్లు మరో ఏడాదే!   | diesel engines in delhi are another year | Sakshi
Sakshi News home page

ఢిల్లీలో డీజిల్‌ ఇంజిన్లు మరో ఏడాదే! 

Feb 4 2018 1:54 AM | Updated on Sep 28 2018 3:27 PM

న్యూఢిల్లీ: ఢిల్లీ ప్రాంతంలో 2019 మార్చి తర్వాత డీజిల్‌ ఇంజిన్‌తో నడిచే రైలు ఒక్కటి కూడా ఉండదని అధికారులు తనకు చెప్పినప్పినట్లు రైల్వే మంత్రి పియూష్‌ గోయల్‌ వెల్లడించారు. 2022 నాటికి దేశవ్యాప్తంగా డీజిల్‌ ఇంజిన్ల వాడకాన్ని నిలిపేసేందుకు కృషి చేస్తున్నామనీ, ఆ తర్వాత నుంచి అన్ని రైళ్లనూ విద్యుత్తు ఇంజిన్లతోనే పరుగులు తీయిస్తామని ఆయన తెలిపారు. ఈ ఏడాది జనవరి 31 నాటికి రైల్వే 279 విద్యుత్తు ఇంజిన్‌లను అందుబాటులోకి తెచ్చిందనీ, ఈ సంఖ్యను వెయ్యికి పెంచాల్సి ఉందని గోయల్‌ చెప్పారు. 2019 నాటికి ఈ లక్ష్యాన్ని చేరుకునేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. దేశవ్యాప్తంగా డీజిల్‌ ఇంజిన్ల స్థానంలో విద్యుత్తు ఇంజిన్లను ప్రవేశపెడితే రైల్వేకు ఏడాదికి రూ.11,500 కోట్లు ఆదా అవడంతోపాటు రైళ్ల వేగం కూడా స్వల్పంగా పెరుగుతుందని అంచనా.

Advertisement
 
Advertisement
Advertisement