గురునాథ్ పై ధోని ఎప్పుడు మాట్లాడలేదు: బీసీసీఐ | Dhoni no comments on Gurunath meiyappan, says Board of Control for Cricket in India | Sakshi
Sakshi News home page

గురునాథ్ పై ధోని ఎప్పుడు మాట్లాడలేదు: బీసీసీఐ

Mar 28 2014 12:02 PM | Updated on Sep 2 2018 5:20 PM

బీసీసీఐ అధ్యక్షుడు శ్రీనివాసన్ అల్లుడు గురునాథ్ మేయప్పన్పై ధోని ఎలాంటి ప్రకటనలు చేయలేదని బీసీసీఐ శుక్రవారం సుప్రీంకోర్టుకు విన్నవించింది.

బీసీసీఐ అధ్యక్షుడు శ్రీనివాసన్ అల్లుడు గురునాథ్ మేయప్పన్పై ధోని ఎలాంటి ప్రకటనలు చేయలేదని బీసీసీఐ శుక్రవారం సుప్రీంకోర్టుకు విన్నవించింది. ధోనిపై అనవసరంగా ఆరోపణలు చేస్తూ ఆయన్నితప్పుగా చిత్రీకరిస్తోందని బీసీసీఐ ఈ సందర్బంగా మీడియాను విమర్శించింది.

 

గురువారం సుప్రీంకోర్టులో జరిగిన విచారణాంశాలను కూడా మీడియా వక్రీకరించిందని బీసీసీఐ విమర్శించింది. గురునాథ్ మేయప్పన్ కేవలం క్రికెట్ ఔత్సాహికడేనని ధోని ఎప్పుడూ ఎక్కడ అనలేదని బీసీసీఐ సుప్రీంకోర్టుకు తెలిపింది.
 

Advertisement
 
Advertisement
Advertisement