ఒక్కోటి రూ.200! | Delhi 'broom bundle' of rising prices hiked. | Sakshi
Sakshi News home page

ఒక్కోటి రూ.200!

Feb 11 2015 3:38 AM | Updated on Sep 2 2017 9:06 PM

ఒక్కోటి రూ.200!

ఒక్కోటి రూ.200!

ఆప్ సునామీతో మంగళవారం ఢిల్లీలో ‘చీపురు కట్ట’ల ధరలు అమాంతం పెరిగిపోయాయి.

ఆప్ సునామీతో మంగళవారం ఢిల్లీలో ‘చీపురు కట్ట’ల ధరలు అమాంతం పెరిగిపోయాయి. పార్టీ గుర్తు అయిన ‘జాడూ’ చేతిలో పట్టుకొని సంబరాల్లో పాల్గొందామని ఆప్ శ్రేణులు వాటిని కొనడానికి ఎగబడ్డారు. దుకాణదారులు ఈ గిరాకీని ఊహించి తగినన్ని చీపురుకట్టలు స్టాక్ పెట్టినా... అన్నీ అయిపోయాయి.

సాధారణంగా రూ.30 నుంచి రూ.50 పలికే చీపురు కట్ట ఏకంగా రూ. 200 పలికిందట. ఇంత ధర పెట్టడానికి సిద్ధమైనా దొరకకపోవడంతో కొన్నిచోట్ల ఆప్ అభిమానులు ఉసూరుమన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement