నాకు ప్రత్యేక తెలంగాణే ముఖ్యం | CM KCR says to Pranab Mukherjee my aim is separate telangana | Sakshi
Sakshi News home page

నాకు ప్రత్యేక తెలంగాణే ముఖ్యం

Oct 23 2017 2:38 AM | Updated on Aug 24 2018 2:01 PM

CM KCR says to Pranab Mukherjee my aim is separate telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తప్ప తనకు మరేదీ ముఖ్యం కాదని టీఆర్‌ఎస్‌ అధినేత కె.చంద్రశేఖర్‌రావు తనతో అన్నట్టు మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ గుర్తుచేసుకున్నారు. తాజాగా తాను రాసిన ‘ద కొలిషన్‌ ఇయర్స్‌–1996–2012’ పుస్తకంలో ఈ మేరకు పేర్కొన్నారు. 2004 సార్వత్రిక ఎన్నికల్లో యూపీఏ విజయం సాధించిన అనంతరం కేంద్ర కేబినెట్‌ పదవుల పంపకాలపై మిత్రపక్ష నేతలతో సంప్రదింపులు జరుపుతున్న సందర్భాన్ని ఉటంకిస్తూ ఈ విషయాన్ని వెల్లడించారు.

‘‘ప్రణబ్‌జీ.. మీకు నా జీవితాశయం తెలుసు. నాకు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కావాలి. మీరు కేంద్ర ప్రభుత్వంలో నాకు ఏ శాఖను అప్పగిస్తారన్నది అంత ముఖ్యం కాదు. ఏ శాఖ బాధ్యతలు అప్పగించినా సంతోషంగా స్వీకరిస్తా. కానీ దయచేసి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును పరిశీలించండి..’’ అని తనతో కేసీఆర్‌ అన్నట్టు ప్రణబ్‌ పుస్తకంలో వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement