సివిల్స్ రాయడానికి మరో రెండు ఛాన్సులు | civils aspirants to have two more chances | Sakshi
Sakshi News home page

సివిల్స్ రాయడానికి మరో రెండు ఛాన్సులు

Jun 1 2014 11:26 AM | Updated on Sep 22 2018 7:37 PM

సివిల్స్ రాయాలనుకునే అభ్యర్థులకు శుభవార్త. ఇప్పటివరకు నాలుగుసార్లు మాత్రమే ఈ పరీక్ష రాసే అవకాశం ఉండగా దాన్నిప్పుడు ఆరుకు పెంచారు.

సివిల్స్ రాయాలనుకునే అభ్యర్థులకు శుభవార్త. ఈ పరీక్షల విషయంలో యూపీఎస్సీ భారీ సంస్కరణలకు తెరతీసింది. ఇప్పటివరకు నాలుగుసార్లు మాత్రమే ఈ పరీక్ష రాసే అవకాశం ఉండగా దాన్నిప్పుడు ఆరుకు పెంచారు. దాంతోపాటు వయసు మినహాయంపు కూడా లభించనుంది. ఈ మేరకు యూపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇంతకుముందులాగే ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు మాత్రం ఎన్నిసార్లయినా ఈ పరీక్ష రాసుకోవచ్చు. అలాగే 21 నుంచి 32 ఏళ్ల మధ్య వయసున్నవారు ఈ ప్రతిష్ఠాత్మ పరీక్షకు హాజరు కావచ్చు.

ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఐఆర్ఎస్.. ఇలాంటి ప్రతిష్ఠాత్మక సర్వీసుల కోసం యూపీఎస్సీ ఈ సివిల్స్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. 2014 సంవత్సరానికి సంబంధించిన ప్రిలిమ్స్ పరీక్ష ఆగస్టు 24న జరగనుంది. ఈసారి సుమారు 1291 పోస్టులను భర్తీ చేయాలని యోచిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement