సీబీఎస్ఈ పదో తరగతి ఫలితాలు విడుదల | CBSE Tenth Class Results Released On Wednesday | Sakshi
Sakshi News home page

సీబీఎస్ఈ పదో తరగతి ఫలితాలు విడుదల

Jul 15 2020 1:20 PM | Updated on Jul 15 2020 7:26 PM

CBSE Tenth Class Results Released On Wednesday - Sakshi

న్యూఢిల్లీ: సెంట్రల్ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (సీబీఎస్ఈ) పదో తరగతి తుది ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. ఫలితాలను తన అధికారిక వెబ్‌సైట్ www.cbseresults.nicలో అందుబాటులో ఉంచినట్టు సీబీఎస్‌ఈ పేర్కొంది. అలాగే, www.cbse.nic.in వెబ్‌‌సైట్‌లో కూడా ఫలితాలు చూసుకోవచ్చని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ బుధవారం వెల్లడించింది. ప్రభుత్వ సర్వీసులను అందించడానికి ఇటీవల కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ఉమాంగ్‌ మొబైల్‌ యాప్ ద్వారా కూడా ఫలితాలను తెలుసుకోవచ్చు. అలాగే, 011-24300699 టోల్ఫ్రీ నంబర్‌ ద్వారా విద్యార్థులు ఫలితాలు‌ తెలుసుకోవడానికి వీలు కల్పించారు. ఈ విద్యా సంవత్సరం సీబీఎస్‌ఈ వార్షిక పరీక్షలు నిర్వహిస్తున్న క్రమంలో అకస్మాత్తుగా కరోనా మహమ్మారి తెరమీదకు రావడంతో కొన్ని సబ్జెక్టుల పరీక్షలు నిర్వహించకుండానే వాయిదా పడ్డాయి. అలా వాయిదా పడిన పరీక్షలు తిరిగి ఎప్పుడు నిర్వహించాలన్న అంశం ఇంతకాలం వాయిదా పడుతూ వచ్చింది.

కరోనా మహమ్మారి మరింత తీవ్రమవుతున్న పరిస్థితుల్లో మిగిలిన పరీక్షలను రద్దు చేసింది. రద్దు చేసిన పరీక్షలకు ప్రత్యామ్నాయ పద్ధతుల్లో విద్యార్థుల ప్రతిభ ఆధారంగా సుప్రీంకోర్టుకు తెలియజేసిన రీతిలో మార్కులను కేటాయించిట్టు సీబీఎస్‌ఈ తెలియజేసింది. ఆ రకంగా అన్ని పరీక్షలకు మదింపు ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో బుధవారం తుది ఫలితాలను విడుదల చేశారు.

12వ తరగతి ఫలితాలు  సీబీఎస్ఈ  సోమవారమే విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ ఏడాది 18 లక్షల మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాశారు. (సీబీఎస్‌ఈ ‘12’లో బాలికలదే పైచేయి)ఈ ఏడాది పరీక్షకు హాజరైన విద్యార్థుల్లో 91.46 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. గతేడాది ఫలితాలతో పోల్చితే ఇది 0.36 శాతం అధికం. ఫలితాల్లో బాలికలు అత్యధికంగా 93.31 శాతం ఉత్తీర్ణత సాధించారు. బాలురు 90.14 శాతం ఉత్తీర్ణులయ్యారు. ఈ మొత్తం ఫలితాల్లో 41,804 (2.23 శాతం) మంది విద్యార్థులు 95 శాతం మార్కులతో అగ్రస్థానంలో నిలిచారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement