బీహార్‌లో విద్యార్థినిపై గ్యాంగ్‌రేప్ | Bihar student gang | Sakshi
Sakshi News home page

బీహార్‌లో విద్యార్థినిపై గ్యాంగ్‌రేప్

Nov 22 2014 5:16 AM | Updated on Nov 9 2018 5:02 PM

బీహార్‌లో ఓ పాఠశాల విద్యార్థినిపై ఆరుగురు కామాంధులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

పాట్నా: బీహార్‌లో ఓ పాఠశాల విద్యార్థినిపై ఆరుగురు కామాంధులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. పాట్నాకు 38 కిలోమీటర్ల దూరంలోని బిహ్తా ప్రాంతంలో గురువారం ఈ ఘటన జరిగింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహాదళిత్ సామాజిక వర్గానికి చెందిన బాలిక పరీక్షల సన్నద్ధత కోసం ఆమె బిహ్తాలోని బంధువుల ఇంటికి వచ్చింది. గురువారం తోటి విద్యార్థినిని కలిసేందుకు ఆమె గ్రామానికి సమీపంలోని వంతెన వద్దకు వెళ్లింది.

ఈ సమయంలో అక్కడికి వచ్చిన ఆరుగురు యువకులు వీరిద్దరినీ సమీపంలోని పొలాల్లోకి లాక్కెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలి అరుపులు విన్న స్థానికులు అక్కడికి  వచ్చి ఆమెను రక్షించారు. మొత్తం నలుగురు నిందితులను అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement