ఆ ముగ్గురు నటులపై బీహార్లోనూ కేసు | Bihar court orders FIR against 3 actors, | Sakshi
Sakshi News home page

ఆ ముగ్గురు నటులపై బీహార్లోనూ కేసు

Jun 2 2015 7:57 PM | Updated on Oct 8 2018 4:21 PM

ఆ ముగ్గురు నటులపై బీహార్లోనూ కేసు - Sakshi

ఆ ముగ్గురు నటులపై బీహార్లోనూ కేసు

మ్యాగీ నూడుల్స్ వివాదం దాని ప్రచారకర్తలు, బాలీవుడ్ నటులు అమితాబ్ బచ్చన్, మాధురీ దీక్షిత్, ప్రీతి జింటాలను వెంటాడుతోంది.

న్యూఢిల్లీ: మ్యాగీ నూడుల్స్ వివాదం దాని ప్రచారకర్తలు, బాలీవుడ్ నటులు అమితాబ్ బచ్చన్, మాధురీ దీక్షిత్, ప్రీతి జింటాలను వెంటాడుతోంది. యూపీలో ఈ ముగ్గురిపై కేసులు నమోదు చేయగా, తాజాగా బీహార్లోనూ ఇదే పరిస్థితి ఎదురైంది. అమితాబ్, మాధురీ, ప్రీతిలపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిందిగా ముజఫర్పూర్ కోర్టు ఆదేశించింది.

ఇక మ్యాగీ నూడుల్స్ ఉత్పత్తిదారులకు వరుస కష్టాలు ఎదురవుతున్నాయి. మ్యాగీ ఉత్పత్తులు సురక్షితం కాదని లాబ్ పరీక్షల్లో తేలినట్టు ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించింది. కేరళలో వీటిపై నిషేధం విధించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement