ఆర్మీ మేజర్‌ను కాల్చి చంపిన జవాను! | Army Major Shot Dead Allegedly By Jawan After Dispute At Post Near LoC | Sakshi
Sakshi News home page

ఆర్మీ మేజర్‌ను కాల్చి చంపిన జవాను!

Jul 18 2017 10:56 AM | Updated on Sep 5 2017 4:19 PM

ఆర్మీ మేజర్‌ను కాల్చి చంపిన జవాను!

ఆర్మీ మేజర్‌ను కాల్చి చంపిన జవాను!

భారత ఆర్మీలో మేజర్‌ ర్యాంకులో పనిచేస్తున్న వ్యక్తిని జవాను కాల్చిచంపినట్లు రిపోర్టులు వచ్చాయి.

శ్రీనగర్‌: భారత ఆర్మీలో మేజర్‌ ర్యాంకులో పనిచేస్తున్న వ్యక్తిని జవాను కాల్చిచంపినట్లు రిపోర్టులు వచ్చాయి. విధి నిర్వహణలో సెల్‌ఫోన్‌ను వినియోగిస్తున్న జవానును మేజర్‌ ప్రశ్నించగా.. కోపోద్రేకుడైన జవాను మేజర్‌పై కాల్పులు జరిపినట్లు సమాచారం.

దాదాపు ఐదు బుల్లెట్లు మేజర్‌ శిఖర్‌ థాప శరీరంలోకి దూసుకెళ్లడంతో ఆయన అక్కడికక్కడే కుప్పకూలినట్లు పేరు చెప్పడానికి ఇష్టపడని ఆర్మీ అధికారి ఒకరు తెలిపారు. ఇరువురిని ఆర్మీ ఉడి ప్రాంతంలోని నియంత్రణ రేఖకు చేరువలో పికెటింగ్‌కు పంపినట్లు తెలిసింది.





 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement