అటల్ పెన్షన్ యోజన (ఏపీవై) పథకానికి చెల్లించే చందా విషయమై కేంద్ర ప్రభుత్వం పలు సవరణలు చేసింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది.
న్యూఢిల్లీ: అటల్ పెన్షన్ యోజన (ఏపీవై) పథకానికి చెల్లించే చందా విషయమై కేంద్ర ప్రభుత్వం పలు సవరణలు చేసింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది. తాజా సవరణ ప్రకారం.. ఏపీవై చందాదారులెవరైనా మరణించినా వారి భార్య లేదా భర్త (జీవిత భాగస్వామి) ఈ పెన్షన్ ఖాతాను కొనసాగించవచ్చు.
నిర్ణీత గడు వు పూర్తయ్యే వరకూ (చందాదారుడికి 60 ఏళ్లు పూ ర్తయి ఉండే సమయం వరకు) వారు చందా చెల్లిస్తే... వారికి జీవితాంతం నెలనెలా నిర్ధారిత పెన్షన్ మొత్తాన్ని పొందవచ్చు. భాగస్వామి కూడా మరణిం చాక వారి నామినీకి ఏకమొత్తంగా పెన్షన్ సొమ్మును చెల్లిస్తారు.