Nov 19 2016 10:52 AM | Updated on Oct 8 2018 8:37 PM
ఒడిశాలో మావోయిస్టుల బీభత్సం
రహదారి నిర్మాణ పనులను వ్యతిరేకిస్తూ.. మావోలు రెచ్చిపోయారు.
కొరాపుట్: రహదారి నిర్మాణ పనులను వ్యతిరేకిస్తూ.. మావోలు రెచ్చిపోయారు. ఒడిశాలోని కొరాపుట్ జిల్లా సిమిలిగూడ సమితి పరిధిలోని బిస్తర్కోట వద్ద రహదారి నిర్మాణ పనులకు వినియోగిస్తున్న 5 వాహనాలను దగ్ధం చేశారు. శుక్రవారం అర్ధరాత్రి బిస్తర్కోట వద్దకు చేరుకొని అక్కడ పని చేస్తున్న సూపర్వైజర్ జైరాంను ఇన్ఫార్మర్ నెపంతో గొంతుకోసి హత్య చేసిన మావోలు పక్కనే ఉన్న 5 వాహనాలకు నిప్పుపెట్టారు.