ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. 22 మంది మృతి | 22 killed as fire engulfs SUM hospital in Bhubaneswar | Sakshi
Sakshi News home page

ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. 22 మంది మృతి

Oct 17 2016 11:15 PM | Updated on Sep 4 2017 5:30 PM

ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. 22 మంది మృతి

ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. 22 మంది మృతి

ఒడిశాలో సోమవారం రాత్రి ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.

భువనేశ్వర్: ఒడిశాలో సోమవారం రాత్రి ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. భువనేశ్వర్‌లోని ఎస్యూఎమ్ ఆసుపత్రిలో ఒక్కసారిగా మంటలు చెలరేగిన ఘటనలో 22 మంది మృతి చెందారు. డయాలసిస్ వార్డులో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలంటుకోవడంతో అక్కడ చికిత్స పొందుతున్న రోగులు, వారి సహాయకులతో పాటు పలువురు సిబ్బంది మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు.

ప్రమాదం జరిగిన వెంటనే ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. గాయపడిన వారిని స్థానికంగా గల క్యాపిటల్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఎస్‌యూఎమ్ ఆసుపత్రికి పట్టణంలో ప్రముఖ ఆసుపత్రిగా పేరుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement