ముంబై :
యాక్షన్ సూపర్స్టార్ అక్షయ్కుమార్ తాజా సినిమా 'టాయ్లెట్: ఏక్ ప్రేమ్కథ' మంచి టాక్తో దూసుకుపోతోంది. 'భార్య ఇంట్లో ఉండాలంటే.. ఇంట్లో టాయ్లెట్ ఉండాల్సిందే' అన్న సామాజిక అంశంతో ఈ సినిమా తెరకెక్కింది. సినిమా సక్సెస్ టాక్తో దూసుకుపోవడంతో అప్పడే రెండో పార్ట్పై అక్షయ్ కుమార్ భార్య ట్వింకిల్ కన్నా ఓ ఆసక్తికర కామెంట్ చేసింది. దీనికి రెండో పార్ట్లో తొలి సీన్ ఇదే అయ్యి ఉంటుందని బీచ్ పక్కనే బహిర్భూమి వెళ్తున్న ఓ వ్యక్తి ఫోటోను తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది.
మార్నింగ్ వాక్ వెళ్లినప్పడు తాను తీసిన ఈ ఫోటోను పోస్ట్ చేసిన కొద్ది వ్యవధిలోనే వైరల్ అయింది. సినిమా ప్రమోషన్ కోసం మరీ ఇలాంటి ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పెట్టాలా అంటూ కొందరూ విమర్శిస్తుంటే, కనీసం ఈ సినిమా చూసిన తర్వాత అయినా ప్రతి ఒక్కరూ టాయిలెట్లు నిర్మించుకోవాలని ట్వింకిల్ కన్నాకు బాసటగా నిలుస్తూ.. నెటిజన్లు కామెంట్లు చేశారు. అందరికీ టాయిలెట్లు అందుబాటులో ఉండవు కదా..అని ఓ నెటిజన్ చేసిన కామెంట్కు ట్వింకిల్ కన్నా బదులిచ్చారు.. సరిగ్గా అక్కడి నుంచి 7 నుంచి 8 నిమిషాలు నడిస్తే ఓ పబ్లిక్ టాయిలెట్ ఉందని తెలిపారు.
ఈ ఏడాది బాలీవుడ్కు అంతగా కలిసిరాలేదు. సూపర్స్టార్లు సల్మాన్ఖాన్ 'ట్యూబ్లైట్', షారుఖ్ ఖాన్ 'జబ్ హ్యారీ మెట్ సెజెల్' చిత్రాలు బాక్సాఫీస్ వద్ద తీవ్రంగా నిరాశపరిచాయి. కనీసం యావరేజ్ కలెక్షన్లు కూడా రాబట్టలేక.. డిజాస్టర్లుగా మిగిలాయి. 'బాహుబలి-2' తర్వాత బాలీవుడ్ సినిమాలన్నీ వరుసగా ఫ్లాప్ కావడం ఇండస్ట్రీ వర్గాలను తీవ్ర నిరాశకు గురిచేసింది. ఈ నేపథ్యంలో ఎన్నో అంచనాల నడుమ వచ్చిన యాక్షన్ సూపర్స్టార్ అక్షయ్కుమార్ తాజా సినిమా 'టాయ్లెట్: ఏక్ ప్రేమ్కథ' బాలీవుడ్ ఆశలను నిలబెట్టింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ మానస పథకమైన 'స్వచ్ఛభారత్' మద్దతుగా కేవలం రూ. 18 కోట్ల బడ్జెట్తో ఈ సినిమా తెరకెక్కింది.
ఇటు ప్రేక్షకులు, అటు విమర్శకుల నుంచి మంచి రెస్పాన్స్ తెచ్చుకున్న ఈ సినిమా బాక్సాఫీస్కు కొత్త ఊపిరినిచ్చింది. ఆగస్టు 11న (గత శుక్రవరం) విడుదలైన ఈ చిత్రం ఇప్పటికే 96 కోట్లు కలెక్ట్ చేసింది. మొత్తానికి ఎయిర్లిప్ట్, రుస్తుం, హౌస్ఫుల్-3, జాలీ ఎల్ఎల్బీ-2 చిత్రాలతో వరుసగా వందకోట్ల క్లబ్బును అందుకున్న ఈ సూపర్ స్టార్ మరోసారి సూపర్ హిట్ను అందుకొని తన స్టామినా ఏంటో చాటాడు. ‘స్వచ్ఛ్ భారత్ అభియాన్’ నేపథ్యంలో సాగే ప్రేమకథ ఆధారంగా తీసిన ఈ చిత్రానికి శ్రీ నారాయణ్ సింగ్ దర్శకత్వం వహించారు. ఇందులో భూమి పడ్నేకర్, అనుపమ్ ఖేర్, సనాఖాన్ తదితరులు నటించారు.
ఆ సినిమా సీక్వెల్లో తొలి సీన్ ఇదే!
Published Sat, Aug 19 2017 6:14 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- మళ్లీ దోపిడీకి తెరపైకి..
- అవన్నీ అపోహలే
- జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
- నేడు నీట్ యూజీ
- ఐరాసలో జగన్ విజన్
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- అనుపమా కెరీర్ ప్రస్తుతం నాన్స్టాప్గా... జెట్ స్పీడ్లో
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
Advertisement