పార్తిబన్ కు సెన్సార్‌ షాక్‌! | sensor shock to Parthiban | Sakshi
Sakshi News home page

పార్తిబన్ కు సెన్సార్‌ షాక్‌!

Dec 24 2016 2:00 AM | Updated on Sep 4 2017 11:26 PM

పార్తిబన్ కు సెన్సార్‌ షాక్‌!

పార్తిబన్ కు సెన్సార్‌ షాక్‌!

నటుడు, దర్శకుడు పార్తిబన్ కు సెన్సార్‌బోర్డు షాక్‌ ఇచ్చింది. ఇప్పుడు సెన్సార్‌ అనేది చాలా మందికి తలనొప్పిగా మారింది.

నటుడు, దర్శకుడు పార్తిబన్ కు సెన్సార్‌బోర్డు షాక్‌ ఇచ్చింది. ఇప్పుడు సెన్సార్‌ అనేది చాలా మందికి తలనొప్పిగా మారింది. అందుకు కారణం వినోదపు పన్ను రాయితీలే. సెన్సార్‌ బోర్డు యూ/ఏ సర్టిఫికెట్‌ అందించిన చిత్రాలకు వినోదపు పన్ను రాయితీలు వర్తించవు. యూ సర్టిఫికెట్‌లు కోసం చిత్ర దర్శక నిర్మాతలు ఆశించేది అందుకే. ఇటీవల సూర్య నటించిన ఎస్‌–3 చిత్రానికీ యూ/ఏ సర్టిఫికెట్‌ ఇవ్వడంతో ఆ చిత్ర నిర్మాత రివైజింగ్‌ కమిటీకి వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. పార్తిబన్  తాజాగా స్వీయ దర్శకత్వంలో ముఖ్య పాత్ర పోషించిన చిత్రం కోడిట్ట ఇడంగళై నిరప్పుగా.

నటుడు శాంతను భాగ్యరాజ్, నటి పార్వతినాయర్‌ జంటగా నటించిన ఈ చిత్రాన్ని ఈ నెల 23నే విడుదల చేయడానికి సన్నాహాలు చేశారు. అయితే సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తి కాకపోవడంతో విడుదల తేదీని ఈ నెల 30కి వాయిదా వేసినట్లు సమాచారం. కోడిట్ట ఇడంగళై నిరప్పుగా చిత్రానికి సెన్సార్‌ యూ/ ఏ సర్టిఫికెట్‌ ఇవ్వడంతో పార్తిబన్ తో సహా చిత్ర యూనిట్‌ షాక్‌కు గురైంది. అయితే ఈ విషయంలో రివైజింగ్‌ కమిటీకి వెళ్లాలని భావించినా, అలాంటి నిర్ణయంతో చిత్ర విడుదల మరింత ఆలస్యం అవుతుందన్న భావనతో చిత్రానికి యూ/ ఏ సర్టిఫికెట్‌తోనే విడుదల చేయడానికి సిద్ధం అవుతున్నట్లు కోలీవుడ్‌ వర్గాల సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement