బాలీవుడ్‌కు ‘ఎవడు’? | Ram Charan Vamsi Paidipally Yevadu goes Bollywood | Sakshi
Sakshi News home page

బాలీవుడ్‌కు ‘ఎవడు’?

Jul 3 2019 10:22 AM | Updated on Jul 3 2019 10:22 AM

Ram Charan Vamsi Paidipally Yevadu goes Bollywood - Sakshi

మెగా పవర్‌ స్టార్ రామ్‌ చరణ్‌ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ఎవడు. స్టైలిష్ స్టార్‌ అల్లు అర్జున్‌ అతిథి పాత్రలో నటించిన ఈ సినిమాకు దిల్ రాజు నిర్మాత. 2014లో రిలీజ్ అయి మంచి విజయం సాధించిన ఈ సినిమాను ఇన్నేళ్ల తరువాత బాలీవుడ్ లో రీమేక్‌ చేసేందుకు రెడీ అవుతున్నారు.

తెలుగులో ఎవడు సినిమాను నిర్మించిన దిల్ రాజు, బాలీవుడ్ నిర్మాత నిఖిల్ అద్వానీ తో కలిసి ఎవడును రీమేక్‌ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాకు హేట్‌స్టోరి 4 ఫేం మిలాప్ జవేరి దర్శకత్వం వహించనున్నారు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా ప్రారంభించినట్టుగా తెలుస్తోంది. అయితే హీరో హీరోయిన్లు ఎవరన్నది తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement