
హిందీలో ఫేట్ మారుతుందా?
‘రారండోయ్..వేడుక చూద్దాం’ సినిమాలో భ్రమరాంబ క్యారెక్టర్లో రకుల్ ఎంత సందడి చేశారో ప్రేక్షకులకు గుర్తుండే ఉంటుంది.
‘రారండోయ్..వేడుక చూద్దాం’ సినిమాలో భ్రమరాంబ క్యారెక్టర్లో రకుల్ ఎంత సందడి చేశారో ప్రేక్షకులకు గుర్తుండే ఉంటుంది. ఇప్పడు ఈ టాలీవుడ్ భ్రమరాంబ బాలీవుడ్లో తన లక్ను మరోసారి చెక్ చేసుకోవాలనుకుంటున్నారు. మూడేళ్ల క్రితం ‘యారియాన్’ మూవీతో రకుల్ బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. అయితే ఆ సినిమా అంతగా సక్సెస్ కాలేదు. ఆ తర్వాత ‘సిమ్లా మిర్చి’ అనే మరో బాలీవుడ్ మూవీకి సైన్ చేసినప్పటికీ ఈ ప్రాజెక్ట్ సరైన దిశలో సాగడం లేదు.
బాలీవుడ్లో పరిస్థితి తారుమారుగా ఉన్నా తెలుగులో మాత్రం రకుల్ కెరీర్ సూపర్. ఇక్కడ ఎలానూ స్టార్ హీరోయిన్ అనిపించు కున్నారు కాబట్టి, బాలీవుడ్లో కూడా ఆ పేరు తెచ్చుకోవాలను కుంటున్నారామె. కరెక్ట్గా ఇదే టైమ్లో బాలీవుడ్ నుంచి రకుల్కి ఓ ఛాన్స్ వచ్చిందని ఫిల్మ్నగర్ టాక్. సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా నీరజ్ పాండే డైరెక్షన్లో రూపొందనున్న సినిమాలో రకుల్ను హీరోయిన్గా సెలక్ ్టచేశారట. ‘వెడ్నస్ డే’, ‘బేబీ’, ‘ఎమ్.ఎస్.ధోని: ది అన్టోల్డ్ స్టోరి’ వంటి హిట్ చిత్రాలకు నీరజ్ పాండేనే దర్శకుడు కావడంతో రకుల్ వెంటనే ఓకే చెప్పారని బాలీవుడ్ టాక్. ఈ చిత్రంతో అయినా బాలీవుడ్లో రకుల్ ఫేట్ మారాలని కోరుకుంటున్నారు ఆమె అభిమానులు.