కంటతడి పెట్టిన శిల్పాశెట్టి | Priyanka Chopra makes Shilpa Shetty cry! Wonder why? | Sakshi
Sakshi News home page

కంటతడి పెట్టిన శిల్పాశెట్టి

Sep 8 2014 4:35 PM | Updated on Sep 2 2017 1:04 PM

కంటతడి పెట్టిన శిల్పాశెట్టి

కంటతడి పెట్టిన శిల్పాశెట్టి

శిల్పాశెట్టి భాదపడటానికి కారణం ప్రియాంక చోప్రా నటించిన 'మేరి కోమ్' చిత్రాన్ని చూసి ఉద్వేగానికి లోనుకావడమే.

ముంబై: బాలీవుడ్ నటి శిల్పాశెట్టి ఏడవడానికి కారణం ప్రియాంక చోప్రా కారణమైందట.  ప్రియాంక చోప్రా నటించిన 'మేరి కోమ్' చిత్రాన్ని చూసి ఉద్వేగానికి లోనవ్వడమే తన దుఖానికి  కారణమని శిల్పాశెట్టి తెలిపింది. ఒమంగ్ కుమార్ దర్శకత్వం వహించిన 'మేరి కోమ్' చిత్రం సెప్టెంబర్ 5 తేదిన విడుదలైన సంగతి తెలిసిందే. ఇటీవల ఈ చిత్రాన్ని చూసిన శిల్పా. ప్రియాంక నటనను చూసి ఉద్వేగానిక లోనై కంటతడి పెట్టినట్టు ట్విటర్ లో ఓ సందేశాన్ని పోస్ట్ చేశారు. 
 
మేరి కోమ్ చిత్రాన్ని చూశాను. ప్రియాంక అద్బుతంగా నటించింది. ఒమంగ్ కుమార్ దర్శకత్వం బాగుంది. ఈ చిత్రాన్ని చూసి కంట తడి పెట్టుకున్నారు. ప్రతి ఒక్కరు చూడాల్సిన చిత్రం అని శిల్ప ట్వీట్ చేశారు. బాక్సింగ్ చాంఫియన్ మేరి కోమ్ తో శిల్పాశెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రాలు అభినందించారు. 
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement