నవ్వుకున్నాం.. ఏడ్చాం : నాగార్జున | Nagarujana tweet about Last week incident | Sakshi
Sakshi News home page

నవ్వుకున్నాం.. ఏడ్చాం : నాగార్జున

Nov 14 2017 10:32 AM | Updated on Jul 15 2019 9:21 PM

Nagarujana tweet about Last week incident - Sakshi

వరుస రెండు రోజుల్లో కొన్ని ఆనందకరమైన క్షణాలు, మరికొన్ని బాధాకరమైన విషయాలు జరగటంపై హీరో నాగార్జున స్పందించారు. ఇటీవల ఒక్కటైన నాగచైతన్య, సమంత రిసెప్షన్‌ను హైదరాబాద్‌లో ఘనంగా నిర‍్వహించారు. ఈ కార్యక్రమానికి అక్కినేని, దగ్గుబాటి కుటుంబ సభ్యులతో టాలీవుడ్‌ ఇండస్ట్రీ ప్రముఖులు, పలువురు రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ఈ వేడుకలో అక్కినేని కుటుంబసభ్యులు ఉత్సాహంగా పాల్గొన్నారు. అయితే వేడుకలు ముగిసి 24 గంటలు గడవక ముందే ఓ విషాదకర సంఘటన జరిగింది.

అక్కినేని నాగేశ్వరరావు నటించిన చివరి చిత్రం మనం షూటింగ్‌ జరిగిన సెట్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. అన్నపూర్ణ స్టూడియోస్‌లో నిర్మించిన ఈ సెట్‌ ప్రమాదంలో పూర్తిగా కాలిపోయింది. తన తండ్రి గుర్తుగా ఉంచిన సెట్‌ కాలిపోవటంతోపై నాగార్జున ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ప్రమాదంలో ఎవరికీ ఏమీ జరగకపోవటంతో ఊపిరి పీల్చుకున్నారు. ఈ రెండు సంఘటనపై స్పందించిన నాగ్‌, ‘ ఈ వారం ఎంతో భావోద్వేగంగా గడిచింది. నవ్వుకున్నాం.. ఏడ్చాం.. ప్రస్తుతం ఈ రోజు మద్యాహ్నం నుంచి హలో సినిమా ప‍్రచార కార్యక్రమాలకు సిద్ధమవుతున్నాం’ అంటూ ట్వీట్‌ చేశారు.

తొలి సినిమా అఖిల్‌ తో నిరాశపరిచిన అక్కినేని వారసుడు, రెండో ప్రయ్నతంగా ‘హలో’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. మనం ఫేం విక్రమ్‌ కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాతో కళ్యాణీ ప్రియదర్శన్‌ హీరోయిన్‌గా పరిచయం అవుతోంది. ఈ సినిమాను క్రిస్టమస్‌ కానుకగా డిసెంబర్‌ 22న రిలీజ్‌ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. ఈ సినిమా ప్రచార కార్యక్రమాలు ఈ రోజు మద్యాహ్నం రెండు గంటలకు ప్రారంభించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement